ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో విషాద ఘటన వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో విషాద ఘటన వెలుగు చూసింది. స్విమ్మింగ్‌పూల్‌(Swimming pool) నుంచి బయటకు వచ్చిన 17 బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మీరట్‌లో(Mirat) జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది.

సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. కాసేపు సరదాగా ఈతకొట్టాడు. ఈత కొలను నుంచి బయటకు వచ్చి గట్టుపై అటూఇటూ తిరిగాడు. తర్వాత ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్నవారు బాలుడిని లేపేందుకు చాలా ప్రయత్నించారు. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story