మిజోరంలో(Mizoram) బుధవారం ఘోర‌ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి(Railway Bridge) కూలిపోవడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరికొంత మంది కూలిన‌ బ్రిడ్జి కింద‌ చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశం మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు(Aizawl) దాదాపు 21 కి.మీ దూరంలో ఉంటుంది.

మిజోరంలో(Mizoram) బుధవారం ఘోర‌ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి(Railway Bridge) కూలిపోవడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరికొంత మంది కూలిన‌ బ్రిడ్జి కింద‌ చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశం మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు(Aizawl) దాదాపు 21 కి.మీ దూరంలో ఉంటుంది. ఉదయం 10 గంటల సమయంలో కూలీలంతా వంతెనపై పని చేస్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించింది. శిథిలాల నుంచి ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీశామని.. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఘటన సమయంలో ఆ ప్రాంతంలో 35-40 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకుని ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను బయటకు తీశారు. మరికొంత మందిని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప‌ట్టార‌ని ఈశాన్య సరిహద్దు రైల్వే సీపీఆర్వో సబ్యసాచి తెలిపారు.

Updated On 23 Aug 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story