దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మహా దారుణం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ పాశవిక ఘటన ఆసత్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్యానీ(Biryani) కొనుక్కోవడానికి పైసలియ్యలేదన్న కోపంతో 17 ఏళ్ల మైనర్‌ను 16 ఏళ్ల బాలుడు విచక్షణరహితంగా పొడిచాడు(stabbed). అతడి శరీరంపై కత్తితో 55 సార్లు పొడిచాడు. అప్పటికీ కసి తీరక పాశవికంగా గొంతు కోశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని వీధిలో ఈడ్చుకుంటూ డాన్సులు చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మహా దారుణం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ పాశవిక ఘటన ఆసత్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్యానీ(Biryani) కొనుక్కోవడానికి పైసలియ్యలేదన్న కోపంతో 17 ఏళ్ల మైనర్‌ను 16 ఏళ్ల బాలుడు విచక్షణరహితంగా పొడిచాడు(stabbed). అతడి శరీరంపై కత్తితో 55 సార్లు పొడిచాడు. అప్పటికీ కసి తీరక పాశవికంగా గొంతు కోశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని వీధిలో ఈడ్చుకుంటూ డాన్సులు చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అప్పటికే ఆ బాలుడు ఫుల్లుగా తాగి(Drunk) ఉన్నాడు. కిందపడి కొట్టుకుంటున్న మైనర్‌ జుట్టు పట్టుకుని పైకి లేపి జేబులోంచి 350 రూపాయలు తీసుకుని అక్కడి నుంచి నింపాదిగా వెళ్లిపోయాడు. పోలీసులు(Police) ఘటనస్థలానికి వచ్చి బాధితుడిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు చనిపోయాడు. ఉత్తర ఢిల్లీలోని వెల్కమ్‌ కాలనీ(Wellcome) ప్రాంతంలో సుమారు రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తన మానాన తను నడుచుకుంటూ వెళుతున్నాడు మైనర్‌. అతడిని అడ్డగించిన నిందితుడు బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులివ్వాల్సిందిగా రుబాబ్‌ చేశాడు. అయితే డబ్బులివ్వడానికి అతడు అంగీకరించకపోవడంతో ఒక్కసారిగా దాడికి దిగాడు. గొంతుపిసికి ఊపిరి ఆడకుండా చేశాడు. అతడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కత్తితో ముఖం, మెడ, వీపుపై దాదాపు 55 సార్లు పొడిచాడు. ఆపై గొంతు కోశారు. ఆ బాలుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులకు కత్తి చూపించి బెదిరించాడు. ఈ దారుణమంతా సీసీ టీవీలో రికార్డయ్యింది. దీని ఆధారంగానే పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు

Updated On 24 Nov 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story