ఓ యువతి తన అన్నను గొడ్డలితో అతికిరాతకంగా నరికిచంపింది. ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) ఖైరాగఢ్‌(Khairagarh) చుయిఖదాన్‌ గండై జిల్లాలో అమ్లిదిహ్కల గ్రామలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పైగా తన అన్నను ఎవరో చంపారని నాటకమాడింది. స్థానికులను నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఇదే వర్షన్‌ వినిపించింది. వివరాల్లోకి వెళ్తే..

ఓ యువతి తన అన్నను గొడ్డలితో అతికిరాతకంగా నరికిచంపింది. ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) ఖైరాగఢ్‌(Khairagarh) చుయిఖదాన్‌ గండై జిల్లాలో అమ్లిదిహ్కల గ్రామలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పైగా తన అన్నను ఎవరో చంపారని నాటకమాడింది. స్థానికులను నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఇదే వర్షన్‌ వినిపించింది. వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఖైరాగఢ్‌ చుయిఖదాన్‌ గండై జిల్లా అమ్లిదిహ్కల గ్రామంలో సొంత అన్ననే చంపింది ఓ చెల్లెలు. పదేపదే అబ్బాయిలతో ఫోన్‌(Phone) మాట్లాడడం చూసి అన్న మందలించాడు. ఇకపై ఫోన్ వాడొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో అతనిపై కోపం పెంచుకుంది 14 ఏళ్ల బాలిక. అన్న నిద్రిస్తుండగా, మెడపై గొడ్డలితో నరికేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు స్నానం చేసింది. తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. ఆ తరువాత తన సోదరుడి హత్య గురించి ఇరుగుపొరుగు వారికి తెలియజేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి హత్య విషయంలో బాలిక వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో లోతుగా విచారణ చేయగా హత్య చేసినట్లు బాలిక అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన జరిగిన సమయంలో తాను, తన అన్న మాత్రమే ఇంట్లో ఉన్నారని, ఇతర కుటుంబ సభ్యులు పనికి వెళ్లారని బాలిక పోలీసులకు తెలిపింది. నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు

Updated On 6 May 2024 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story