దేశంలో నిత్యం ఆడపిల్లలపై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజ‌గా అస్సాంలోని(Assam) కోక్రాఝర్ జిల్లాలో కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

దేశంలో నిత్యం ఆడపిల్లలపై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజ‌గా అస్సాంలోని(Assam) కోక్రాఝర్ జిల్లాలో కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం నలుగురు యువకులు బాలికను బలవంతంగా కారులో కూర్చోబెట్టారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

అనంతరం ఆమెను జాతీయ రహదారి 31సి వద్దకు తీసుకెళ్లి.. అక్కడ కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ప్రాంతం దోత్మా నగరానికి సమీపంలో ఉందని అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెతకడం ప్రారంభించారు. దోత్మా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోక్రాజార్‌లోని కోర్టులో హాజరుపరిచి.. మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించారు.

Updated On 18 May 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story