దేశంలో మరోసారి కరోనా (Covid-19) వైరస్ మరణ మృదంగం మొదలైంది. ఒక్క రోజే 12 మంది (12 Members) కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలోనే దేశంలో 761 మందికి కొత్తగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది

దేశంలో మరోసారి కరోనా (Covid-19) వైరస్ మరణ మృదంగం మొదలైంది. ఒక్క రోజే 12 మంది (12 Members) కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలోనే దేశంలో 761 మందికి కొత్తగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు మాత్రమే పెరగ్గా.. ఇప్పుడు మరణాలు కూడా పెరుగుతుండటంతో దేశంలో మరోసారి కరోనా భయందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 4334 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 12 మందిలో కేరళకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385కి చేరింది.

Updated On 5 Jan 2024 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story