కర్నాటకలో(Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur)దగ్గర ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సత్యసాయి జిల్లా గోరంట్ల (Gorantla)కు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కర్నాటకలో(Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ (Chikkaballapur)దగ్గర ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సత్యసాయి జిల్లా గోరంట్ల (Gorantla)కు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్‌ సాయంతో పక్కకు తరలించారు. తీవ్ర మంచు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. టాటా సుమోలో గోరంట్ల నుంచి కర్నాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా గోరంట్లలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated On 26 Oct 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story