మహారాష్ట్రలో(Maharashtra) దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం(rape) జరిగింది.

మహారాష్ట్రలో(Maharashtra) దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం(rape) జరిగింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో నలుగురు మైనర్లు(Minors) ఉండటం గమనార్హం. పైగా ఈ నిందితులకు ఓ బాలిక సహకరించడం అత్యంత దారుణం. అంబర్‌నాథ్ పట్టణంలోని 11 ఏళ్ల బాలికకు మయా మాటలు చెప్పి మరో బాలిక తన వెంట తీసుకెళ్లింది. ఆ పాపను నిందితులు ఉన్న చోటుకు పట్టుకెళ్లింది. ప్రధాన నిందితుడు ఆ బాలికను ఆటో రిక్షాలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ప్రధాన నిందితుడు కూడా మైనరేనని పోలీసులు చెప్పారు. బాలిక ఎలాగోలా తప్పించకుని పారిపోయి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితులపై కేసు పెట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మైనర్‌తో పాటు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వయోజన నిందితులను పోలీసు కస్టడీలో ఉంచామని, మైనర్ నిందితులను రిఫార్మ్ హోమ్‌కు పంపామని పోలీసులు చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story