తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో(supreme court) విచారణ జరిగింది.

తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో(supreme court) విచారణ జరిగింది. లడ్డూ విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు(independent investigation) ఆదేశించింది. స్వతంత్ర దర్యాపు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐదుగురు సభ్యులతో కొత్త సిట్‌ ఏర్పాటు చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు, సిట్ నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు ఉండాలని ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ విచారణను పర్యవేక్షిస్తారని సూచించింది. పొలిటికల్ డ్రామాను అంగీకరించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఈమేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ' అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story