సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు(AP elections) ముందు, అంటే 2019లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) బయోపిక్‌(Biopic) మూవీ యాత్ర(Yatra) విడుదలయ్యింది. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌ పాత్రను మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి(Mammootty) ధరించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు(AP elections) ముందు, అంటే 2019లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) బయోపిక్‌(Biopic) మూవీ యాత్ర(Yatra) విడుదలయ్యింది. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌ పాత్రను మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి(Mammootty) ధరించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2(Yatra 2)ను రూపొందించారు మహి.వి.రాఘవ. ఈ సినిమా కూడా సరిగ్గా ఎన్నికలకు ముందే విడుదల కాబోతున్నది. ఇందులో జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) పాత్రను తమిళ నటుడు జీవా(Jiiva) పోషించారు. ఈ సినిమాను త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్‌గా శుక్రవారం యాత్ర 2 టీజర్‌ను(Teaser) విడుదల చేసింది చిత్రయూనిట్‌. యూట్యూబ్‌లో(Youtube) విడుదలైన నిమిషం నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యాత్ర 2 సినిమాలో వై.ఎస్‌.జగన్మోహర్‌రెడ్డి కథనే ఉంటుంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణించడానికి ముందు ఏపీలో పరిస్థితులు, చనిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు, ఓదార్పు యాత్ర, జగన్‌ జైలుకు వెళ్లడం, పాదయాత్ర, జగన్‌ ముఖ్యమంత్రి కావడం .. యాత్ర 2లో చూపించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేశ్‌ మంజ్రేకర్‌, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్‌, వై.ఎస్‌.భారతి పాత్రలో కేతికి నారాయణ్‌ నటిస్తున్నారు. మొత్తంగా యాత్ర 2 టీజర్‌ వైఎస్‌ అభిమానులు అమితంగా ఆకట్టుకుంటున్నది.

Updated On 5 Jan 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story