అత్యాచార ఆరోపణలను(Sexual allegations) ఎదుర్కొంటున్న యూ ట్యూబర్‌(Youtuber) హర్ష సాయి(Harsha sai) ఎట్టకేలకు పెదవి విప్పాడు.

అత్యాచార ఆరోపణలను(Sexual allegations) ఎదుర్కొంటున్న యూ ట్యూబర్‌(Youtuber) హర్ష సాయి(Harsha sai) ఎట్టకేలకు పెదవి విప్పాడు. సోషల్ మీడియా(Social media) వేదికగా స్పందించాడు. సినీ నటి, బాధితురాలు నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. సెల్‌ఫోన్‌లను కూడా స్విచ్చాఫ్‌ చేసి పెట్టుకున్నాడు. మరోవైపు హర్షసాయి(Harsha sai) ఫ్యామిలీ మెంబర్లు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హర్షసాయి తండ్రి రాధాకృష్ణపై(Radha krishna) కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా కనిపించకుండా పోయారు. దీంతో నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో(Instagram) హర్షసాయి ఓ మెసేజ్‌ పెట్టాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని చెప్పాడు. తనపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో అన్యాయంగా అత్యాచార కేసు నమోదు చేశారన్నాడు. డబ్బు కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు త్వరలో బయటకు వస్తాయని హర్షసాయి రాసుకొచ్చాడు. తన అడ్వకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారని కూడా పేర్కొన్నారు. తన గురించి తన ఫాలోవర్స్ కు మాత్రమే తెలుసు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హర్ష సాయి.

యూట్యూబర్‌ హర్షసాయికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉంది. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, సినీ నటి అయిన ఓ యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అందులో పేర్కొంది. పెళ్లి పేరుతో తన దగ్గర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం హర్షసాయి మెగా అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఇందులో బాధితురాలు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆమెనే నిర్మాత. అప్పుడే తనను ప్రేమ పేరుతో హర్షసాయి ట్రాప్‌ చేశాడని ఆమె చెబుతోంది. పలుమార్లు తనపై లైంగికదాడి చేశాడని ఆరోపించింది. ఏకాంతంగా ఉన్నప్పుడు నగ్నఫోటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. వాటిని చూపించి బ్లాక్‌ మెయిల్ చేస్తూ పలుసార్లు లైంగిక దాడి చేశాడని చెప్పింది.

Eha Tv

Eha Tv

Next Story