యాత్ర 2 సినిమా(Yatra 2 Movie)కు సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. సినిమాలో వైఎస్‌ భారతి లుక్‌ను చిత్ర యూనిట్‌ రివీల్ చేసింది. భారతి పుట్టినరోజు (8-12-2023)సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ అగ్రహీరో మమ్ముట్టి, వై.ఎస్‌.జగన్‌గా జీవా నటిస్తున్నారు. వై.ఎస్‌.భారతి పాత్రలో కేతిక నారాయణ్‌ నటిస్తుననారు. మహి.వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్రీ ఆటమ్‌ లీవ్స్‌

యాత్ర 2 సినిమా(Yatra 2 Movie)కు సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. సినిమాలో వైఎస్‌ భారతి లుక్‌ను చిత్ర యూనిట్‌ రివీల్ చేసింది. భారతి పుట్టినరోజు (8-12-2023)సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ అగ్రహీరో మమ్ముట్టి, వై.ఎస్‌.జగన్‌గా జీవా నటిస్తున్నారు. వై.ఎస్‌.భారతి పాత్రలో కేతిక నారాయణ్‌ నటిస్తుననారు. మహి.వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్రీ ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాత్ర 2 సినిమాపై వై.ఎస్‌.కుటుంబం చాలా అంచనాలు పెట్టుకుంది. వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తానని అప్పట్లోనే డైరెక్టర్‌ ప్రకటించారు.ఇప్పుడు ఆ సినిమాకి కొన‌సాగింపుగా, వై.ఎస్‌.ఆర్ త‌న‌యుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు యాత్ర 2ను తెర‌కెక్కిస్తున్నారు. యాత్ర సినిమాను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఇక సినిమాలోని వై.ఎస్‌.భారతి లుక్ చూసి అచ్చుగుద్దినట్టు ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. 'నిజమే అన్నా, మా ఇంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడ్డం కూడా నేర్పించలేదు' అనే ఆమె చెబుతున్నట్టు ఒక పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను కూడా పోస్టర్‌లో పొందుపరిచారు.

Updated On 9 Dec 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story