వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌ను త‌మిళ న‌టుడు జీవా పోషించాడు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి రాజశేఖర్ రెడ్డి

ఈ వారం పలు తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. తాజాగా మరో సినిమా కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పొలిటికల్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ముంద‌స్తుగా ఇటు అమెజాన్ ప్రైమ్‌గానీ, అటు సినిమా యూనిట్‌గానీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు.

వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌ను త‌మిళ న‌టుడు జీవా పోషించాడు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్ర‌లో క‌నిపించారు. యాత్ర 2 మూవీకి మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2019లో విడుద‌లైన యాత్ర మూవీకి సీక్వెల్‌గా యాత్ర 2 తెర‌కెక్కింది. యాత్ర 2లో జ‌గ‌న్ రాజ‌కీయ జీవితాన్ని చూపించారు. యాత్ర 2 మూవీ ఫిబ్ర‌వ‌రి 8న థియేట‌ర్ల‌లో రిలీజైంది. సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఉన్నా.. జ‌గ‌న్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసిన క‌థ‌నే చెప్ప‌డంతో మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్ని పెద్దగా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాలో చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్‌లో మ‌హేష్ మంజ్రేక‌ర్‌ క‌నిపించారు. వైఎస్ఆర్ మరణం దగ్గర మొదలయ్యే 'యాత్ర 2' కథ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవరకు ఉంటుంది.

Updated On 12 April 2024 12:59 AM GMT
Yagnik

Yagnik

Next Story