కెజియఫ్2(KGF 2) రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా.. యష్(Yash) ఇంకా తన నెక్ట్స్ సినిమా ప్రకటించలేదు. ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా.. కనికరించడం లేదు కెజియఫ్ స్టార్.

కెజియఫ్2(KGF 2) రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా.. యష్(Yash) ఇంకా తన నెక్ట్స్ సినిమా ప్రకటించలేదు. ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా.. కనికరించడం లేదు కెజియఫ్ స్టార్. ఇక తాజాగా ఆయన ఓ లేడీ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్ గట్టిగా నడుస్తోంది.

కెజియఫ్ 2 రిలీజ్ అయ్యి సరిగ్గా.. సంవత్సరం అవుతోంది. ఈసినిమా వల్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన చిన్న హీరో యష్.. పాన్ ఇండియా ఇమేజ్ సాధించారు. అయితే ఈ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prashanth neil) నిలబెట్టుకున్నాడు. వరుసగా మూడు పాన్ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. కాని హీరో యష్ మాత్రం ఏడాది అవుతున్నా ఇంత వరకూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేయలేదు. ఇంత ఇమేజ్ వస్తే.. మళ్లీ పాన్ ఇండియా సినిమానేచేయాలి తప్పదు. కాని మరి యష్ తో చేసే డైరెక్టర్ ఎవరు..?

కెజియఫ్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన తరువాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడు. అది ఏ రేంజ్ లో ఉంటుంది అంటూ..ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాని ఆసినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయినా.. ఇంకా యష్ సినిమా అనౌన్స్ చేయకపోవడంతో.. కన్నడ ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతోంది. అటు యష్ నెక్ట్స్ చేయబోయేది.. ఫలానా దర్శకుడితో అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊరిస్తూ ఉండగా.. కొంత మంది డైరెక్టర్ల పేర్లు వినిపించి మాయం అవుతున్నాయి.

ఇప్పటికే సౌత్ స్టార్ డైరెక్టర్లు శంకర్‌, నార్తన్‌ లతో యష్ సినమాలు అంటూ వార్తలు షికారు చేసి చేసి ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. తాజాగా యష్‌ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. యష్‌ నెక్స్ట్‌ మూవీ ఓ లేడీ డైరెక్టర్ తో అంటూ వార్త హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి.. దర్శకురాలిగా తిరుగులేని ఇమేజ్ సాదించిన గీతూ మోహన్‌దాస్‌(Geetu Mohandas) దర్శకత్వంలో యష్‌ నెక్ట్ సినిమా చేయబోతున్నాడట. కేజీఎఫ్‌ లాంటి సినిమా తర్వాత ఒక మహిళా దర్శకురాలితో సినిమా చేయబోతున్నాడంటే.. యష్ ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువంటి కథతో రాబోతున్నాడు అని.. ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

అయితే అవ్వడానికి లేడీ డైరెక్టర్ కాని.. ఆమె టాలెంట్ మాత్రం వేరే లెవల్ అంటున్నారు సినిమా జనాలు. ఆమె దర్శకురాలిగా చేసింది రెండు సినిమాలే అయినా.. అవి ఇండస్ట్రీని ఊపు ఊపేశాయి. లయర్స్‌ డైస్‌(Liar's Dice) అనే హిందీ సినిమాను పదేళ్ల క్రితం డైరెక్ట్ చేసింది గీతూ(Geethu). ఈ సినిమాకు రెండు నేషనల్‌ అవార్డులు సాధించింది. ఇక ఆరేళ్లు గ్యాప్ తీసుకుని పట్టి మిథూన్‌ అనే సినిమా తెరకెక్కించింది.ఈసినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఇన్నాళ్లకు మెగా ఫోన్ పట్టి యఫ్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అని తెలియాలి అంటే.. అఫీషియల్ గా వారు అనౌన్స్ చేసే వరకూ ఆగాల్సిందే. మరో విషయం ఏంటీ అంటే.. ఈ సినిమాను కెవిఎన్‌ బ్యానర్‌పై కెవిఎన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడట.

Updated On 17 April 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story