నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానులపై చేయి కూడా చేసుకుంటుంటారు.

నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానులపై చేయి కూడా చేసుకుంటుంటారు. అభిమానులు కూడా అమ్మనీ తియ్యనీ దెబ్బ అంటూ పాటలు పాడుకుంటారు తప్ప కిమ్మనరు. కమ్మనరు! పైగా బాలయ్యతో కొట్టించుకోవడాన్ని అవార్డులా ఫీలవుతుంటారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో కరణ్‌ జోహార్‌(Karan Johar) ఇదే ప్రశ్నను బాలయ్యను అడిగాడు. మిమ్మల్ని చూసి అందరూ ఎందుకు భయపడతారు అని కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ(Balakrishna) తనదైన స్టయిల్‌లో ఆన్సరిచ్చాడు. 'అభిమానులంతా నన్ను ప్రేమిస్తారు. కొన్ని సార్లు చిరాకు పెడుతుంటారు. అలాంటి సందర్భాలలోనే వారికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తుంటాను' అంటూ చమత్కరించాడు. రిటర్న్‌ గిఫ్ట్ అంటే చెంప దెబ్బగా మనం అర్థం చేసుకోవాలి. జై బాలయ్య అనే నినాదాన్ని మొదటిసారి ఎప్పుడు విన్నారు అని కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జై బాలయ్య నినాదాన్ని విన్నానని చెప్పాడు. ఇలాంటి జవాబులు ఇవ్వడం బాలయ్యకు తప్ప మరొకరికి సాధ్యపడదు. ఇక చిరంజీవి(Chiranjeevi), వెంకటేశ్‌(Venkatesh), నాగార్జున(Nagarjuna)ల గురించి అడిగినప్పుడు వారంతా లెజెండ్స్‌ అని పొగిడాడు బాలయ్య!

ehatv

ehatv

Next Story