ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా నగరంలో.. సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు బాలీవుడ్ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్చారు. అయితే బాలీవుడ్ నుంచి ముఖ్య అతిదిగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ హాజరయ్యారు.

కోల్ కతాలో ఫన్నీ సంఘటన జరిగింది. ఎప్పుడూ సీరియస్ గా.. స్ట్రిక్ట్ గా ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సరదాగా స్టెప్పులేశారు. సందడి చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా నగరంలో.. సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు బాలీవుడ్ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్చారు. అయితే బాలీవుడ్ నుంచి ముఖ్య అతిదిగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ హాజరయ్యారు. ఇక ఈవేడుకల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.

బాలీవుడ్ లో మమతా బెనర్జీ ఫెవరేట్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటనను ఆమె అభిమానిస్తుంటారు. ఇక ఈ వేడుకల్లో ఆయన సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా KIFF 2023 లోసందడి చేశారు. ఈక్రమంలో ఈ వేడుకల్లో అరుదైన దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. చాలా హుందాగా.. సీరియస్ గా ఉండే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాసేపు సరదాగా అభిమానులనుఅలరించారు. ఏకంగా డాన్స్ స్టెప్పులేసి షాక్ ఇచ్చారు.

మమత చేత డాన్స్ చేయించరు సల్మాన్ ఖాన్. వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, అనిల్ కపూర్ ఇతర తారలు కూడా కాలు కదిపారు. అయితే ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సినీ ప్రముఖులతో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్ సహా ఇతరులతో ఒకే వేదికపై చేరడం సినీ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సింగర్ అరిజిత్ సింగ్ పాడిన పాటకు మమతా బెనర్జీ కాలుకదిపి ఫిలిం ఫెస్టివల్‌లో జోష్ నింపారు.

Updated On 7 Dec 2023 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story