మెగా మనవరాలు.. క్లింకారను(Klinkara) చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కాని వాళ్లు మాత్రం పాప ముఖాన్ని దాచేస్తూ.. ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు నిరాశపరుస్తున్నారు. క్లింకారాతో పండుగలుకూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు శేర్ చేస్తున్నారు.

మెగా మనవరాలు.. క్లింకారను(Klinkara) చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కాని వాళ్లు మాత్రం పాప ముఖాన్ని దాచేస్తూ.. ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు నిరాశపరుస్తున్నారు. క్లింకారాతో పండుగలుకూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు శేర్ చేస్తున్నారు. కాని ఆ ఫోటోలలో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు మెగాప్యామిలీ. ఇక తాజాగా చరణ్(Ram charan) దంపతులు ముంబయ్(Mumbai) లో ప్రత్యక్ష్యం అయ్యారుచ ఎందుకు వెళ్ళారో ఏమో తెలియదు కాని.. ముంబయ్ లో సందడి చేసిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

తాజాగా చరణ్ ఉపాసన(Upasana) తమ కూతురు క్లిన్ కారాతో ముంబైలో కనపడ్డారు. తాజాగా ఈ జంట ముంబై వెళ్లగా ఇంట్లోకి వెళ్తుండగా మీడియా వీడియోలు తీశారు. ఉపాసన, క్లిన్ కారా కారులో రాగా చరణ్ ఇంట్లోంచి బయటకి వచ్చి పాపని తీసుకొని లోపలి వెళ్ళాడు.ఇప్పుడు కూడా పాప ఫోటో చూపించకుండా తీసుకెళ్లారు చరణ్, ఉపాసన. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు మెగా వారసురాలిని చూపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు.

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 50 రోజులు షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు సమాచారం. అయితే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లన్ చేస్తున్నారట టీమ్. ఈ మూవీ తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కబోతోంది. ఈమూవీలో సాయిపల్లవి కూడా నటిస్తున్నట్టు టాక్.

Updated On 16 Dec 2023 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story