ఇళయ దళపతి, తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. రాజకీయాల్లోకి రావడానికి సినిమాలను వదిలిపెడతారని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఆయన ప్రస్తుతం నటిస్తున్ సినిమా ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌(The Greatest of All Time).

ఇళయ దళపతి, తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. రాజకీయాల్లోకి రావడానికి సినిమాలను వదిలిపెడతారని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఆయన ప్రస్తుతం నటిస్తున్ సినిమా ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌(The Greatest of All Time). వెంకట్‌ప్రభు(Venkat Prabhu) దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏజీఎన్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. త్వరలో విజయ్‌ నటించబోయే 169వ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అని అంటున్నారు. ఈ సినిమాకు విజయ్‌ ఏకంగా 250 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట! బహుశా భారతీయ చిత్రసీమలో ఇదే అత్యధిక పారితోషికం కావచ్చు. ఇది అలా ఉంచితే చాన్నాళ్లుగా విజయ్‌ తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిజానికి విజయ్‌కు తన తల్లి శోభ(Shoba) అంటే చాలా ఇష్టం. ఆమె మంచి గాయని కూడా! తల్లిపై విజయ్‌కు ఉన్న ప్రేమానురాగాలు అపారం. ఇప్పుడు తల్లి కోసం విజయ్‌ ఓ ఆలయాన్ని కూడా కట్టించారు. చెన్నై(Chennai)లోని స్థానిక కొరట్టూర్‌లో తన స్థలంలో సాయిబాబా ఆలయాన్ని విజయ్‌ కట్టించారు. ఈ ఆలయ కుంభాభిషేకం కూడా గత ఫిబ్రవరి నెలలో నిర్వహించారట. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ చిత్రం షూటింగ్‌ గ్యాప్‌లోనూ విజయ్‌ సాయిబాబా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారట!

Updated On 10 April 2024 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story