పిజ్జా(Pizza) సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. తమిళంలో ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అద్భతమైన నటుడు విజయ్‌ సేతుపతికి మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), రమ్య నంబీషన్‌(Ramya Nambhishan) ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌తో పాటు కాసింత హర్రర్‌ కూడా కలిసిన ఈ సినిమాను తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుంది.

పిజ్జా(Pizza) సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. తమిళంలో ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అద్భతమైన నటుడు విజయ్‌ సేతుపతికి మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), రమ్య నంబీషన్‌(Ramya Nambhishan) ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌తో పాటు కాసింత హర్రర్‌ కూడా కలిసిన ఈ సినిమాను తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుంది. పిజ్జా విజయవంతం కావడంతో ఆ తర్వాత దాని సీక్వెల్‌గా పిజ్జా-2(Pzza-2) విల్లా(Villa) చిత్రాన్ని నిర్మించారు. అది కూడా బ్రహ్మండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో అదే సంస్థలో సీవీ కుమార్‌(CV Kumar) ఇటీవల నిర్మించిన చిత్రం పిజ్జా-3 దిమమ్మీ(Pizza-3 the mummy).. ఇందులో నటుడు అశ్విన్‌ కాక్కుమను(Ashwin Kakkamanu) హీరోగా నటించారు. రవీనా దాహా, సుభిక్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్‌ గోవింద్‌(Mohan Govindh) దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల 28వ తేదీన రిలీజ్‌ అయ్యింది. ఇది కూడా సక్సెస్‌నే అందుకుంది. దీంతో పిజ్జా-4(Pizza-4) చిత్రాన్ని కూడా నిర్మిచనున్నట్టు నిర్మాత సీవీ కుమార్‌ ప్రకటించారు. 'నేను ఇంతకు ముందు హార్రర్‌, సస్పెన్స్‌ నేపథ్యంలో తీసిన పిజ్జా చిత్రం మూడు సీక్వెల్స్‌ను ప్రేక్షకులు ఆదరించారు. వైవిధ్యభరితమైన కథా చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రేక్షకులు నిరూపించారు. వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజ్జా-4 చిత్రాన్ని నిర్మించనున్నాను' అని సీవీ కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలో చెబుతానని అన్నారు.

Updated On 4 Aug 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story