స్టార్‌ హీరోయిన్‌ నయనతార(Nayanthara) వివాహ బంధంపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ను(Vignesh shivan) ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసీతో ఇద్దరు పిల్లలకు ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు.

స్టార్‌ హీరోయిన్‌ నయనతార(Nayanthara) వివాహ బంధంపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ను(Vignesh shivan) ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసీతో ఇద్దరు పిల్లలకు ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. ఈ మధ్యే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోయిన్‌ నయనతార భర్తను అన్‌ఫోలో చేసినట్లు వార్తలు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా విఘ్నేష్‌ ఓ పోస్ట్‌ చేశాడు. ఆ పోస్టు సారాంశం ఏంటంటే 'నయనతార కొన్నిరోజుల కిందట ఓ స్కిన్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. తాజాగా ఆ బ్రాండ్‌కు ఓ అవార్డ్ దక్కిందని విఘ్నేష్ శివన్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీంతో తమ బంధం మరింత దృఢంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు. దీంతో వీరి వివాహ బంధం విడిపోయినట్లు వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టినట్లయింది.

అయితే నయనతార మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. స్టార్‌ హీరోలతో సమానంగా రెమ్యెనరేషన్‌ తీసుకుంటోంది. అయితే సోషల్‌ మీడియాకు మాత్రం దూరంగా ఉంటూనే వస్తోంది. గత కొన్ని రోజుల కిందటే ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తను ఫాలో అవుతున్నవారిలో విఘ్నేష్‌ పేరు లేకపోవడంతో విఘ్నేష్‌ను అన్‌ ఫాలో చేసిందన్న వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా విఘ్నేష్‌ చేసిన పోస్టుతో ఆ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లేనని ఆమె అభిమానులు భావిస్తున్నారు. నయనతార ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చిన్న టెక్నికల్ సమస్య వల్లే విఘ్నేష్ పేరు ఫాలోయింగ్ లిస్ట్లో కనిపించలేదని సన్నిహితులు వివరించారు.

Updated On 4 March 2024 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story