ఈ జంట కూడా విడిపోతుంది

సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) గురించి తెలుగువారికి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయన చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజాలయ్యాయి. కొన్ని మాత్రమే తప్పాయి. నాగచైతన్య(Nagachaithanya), సమంత(Samantha) నిశ్చితార్థం జరిగిన రోజునే ఆ ముహూర్తం ఆధారంగా వీరిద్దరు విడిపోతారని చెప్పారు. వేణుస్వామి చెప్పినట్టుగానే నాగ చైతన్య, సమంత వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత దూళిపాళ(shobhitha dhulipala) నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఎంగేజ్‌మెంట్‌పై వేణుస్వామి సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తర నక్షత్రం, కన్యాలగ్నంలో జరిగిన నిశ్చతార్థం ముహూర్తం అసలు బాగోలేదని, ఎవరైనా ఈ విషయం చెబుతారని వేణుస్వామి అన్నారు. వైవాహిక జీవితానికి సంబంధించి ఏడవ స్థానం ఖాళీగా ఉండాలని, దీన్ని కళత్ర స్థానం అంటారని, అయితే చైతూ, శోభిత నిశ్చితార్థంలో కళత్ర స్థానం ఖాళీగా లేదన్నారు. నిజానికి ఈ ముహూర్తాన్ని నిషేధ ముహూర్తం అంటారని, మరి నాగార్జున ఎందుకు ఈ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. వారేమో ఎనిమిదో నెల, ఎనిమిదో తేదీ, 2024లో ఉన్న నంబర్లు కూడా ఎనిమిదే కాబట్టి ముహూర్తం బలంగా ఉందని అనుకున్నారు కాబోలు అని వేణుస్వామి తెలిపారు. మొత్తంగా ఆయన చెప్పినదేమిటంటే నాగచైతన్య, శోభిత వైవాహిక జీవితం కూడా కలతల మయమేనని! 2027 నుంచి వీరి కాపురంలో కలతలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఓ స్త్రీ వల్ల వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయని వేణుస్వామి జోస్యం చెప్పారు. ముహూర్తం బాగాలేనందుకే అఖిల్(Akhil) ఎంగేజ్‌మెంట్ కాన్సల్‌ అవుతుందని చెప్పానని, అలాగే రద్దు అయ్యిందన్న విషయాన్ని వేణుస్వామి గుర్తు చేశారు. ఇంత చెప్పిన వేణుస్వామి తాను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నానని, తన ఫెయిల్యూర్‌ కంటే చైతూ, శోభిత సక్సెసే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు వేణుస్వామి.



Updated On 9 Aug 2024 5:25 AM GMT
Eha Tv

Eha Tv

Next Story