నాగ చైతన్య(Naga chaithanya), శోభిత(Shobitha) ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) ఓ జాతకం చెప్పారు.

నాగ చైతన్య(Naga chaithanya), శోభిత(Shobitha) ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సంచలన జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) ఓ జాతకం చెప్పారు. నాగచైతన్య, శోభితల నిశ్చితార్థ ముహూర్తం బాగోలేదన్నారు. వారిద్దరు విడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీంతో వేణుస్వామిపై చాలా మంది విరుచుకుపడ్డారు. వ్యక్తగత జీవితాల్లోకి ఎలా చొరపడతారంటూ ప్రశ్నించారు. అసలు వేణుస్వామి జ్యోతిష్కుడే కాదని, ఆయనకు ఏమీ తెలియదని అన్నారు. ఓ పక్క దీనిపై చర్చ జరుగుతున్న సమయంలోనే తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్‌ అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామిపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వేణుస్వామి భార్య వీణ శ్రీవాణి(Veena srivani) ఓ వీడియో విడుదల చేశారు. అందులో మీడియా, జర్నలిస్టుల తీరును ప్రశ్నించారు. తాను కూడా ఒకప్పుడు జర్నలిస్టునని చెబుతూ తాను వేణుస్వామికి మద్దతుగా వీడియో చేయడం లేదని, ఓ జర్నలిస్టుగానే అభిప్రాయాలు చెబుతున్నానని అన్నారు. వేణుస్వామి చెప్పిన అంశాలపై గంటలకు కొద్దీ లైవ్‌ డిబేట్స్‌ నడిపిన మీరు ఇప్పుడు అతడి మీద ఎందుకు ఫిర్యాదు చేశారు అంటూ నిలదీశారు. వేణుస్వామి మీద చర్చలు జరిపే బదులు మరో అంశాలపై ఫోకస్‌ చేయవచ్చు కదా అని అన్నారు. ఒకప్పుడు ఎన్నో టెస్ట్‌లు పాస్‌ అయితేనే జర్నలిస్ట్‌ అనేవారని, కానీ ఇప్పుడు ఒకటి రెండు వీడియో చేస్తే చాలు జర్నలిస్ట్‌లు అయిపోతున్నారని సెటైర్లు విసిరారు.. అసలు ఈ కాలం జర్నలిజానికి అర్థమే మారిపోయిందని, లైవ్‌లో బీప్స్‌ లేకుండానే బూతులు వేస్తున్నారు. ఇవన్ని కూడా పేరున్న సో కాల్డ్‌ మీడియా ఛానెళ్లే చేస్తున్నాయని చెప్పారు. మొత్తం మీద మీడియాకు వీణ శ్రీవాణి పెద్ద పాఠమే చెప్పింది. ఆమె చేసిన పూర్తి వీడియోను ఇప్పుడు చూడండి



Eha Tv

Eha Tv

Next Story