కొన్నాళ్ల పాటు రహస్య ప్రేమలో ఉన్న వరుణ్‌తేజ్‌(Varun Tej)- లావణ్య త్రిపాఠిలు(Lavanya Tripati) త్వరలో ఏడడగులు నడవబోతున్నారు. ఇటీవలే వరుణ్‌- లావణ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అసలు వీరు ప్రేమలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ ఎంగేజ్‌మెంట్ చాలా మందికి షాక్‌నిచ్చింది. ఆరేళ్ల కిందట వచ్చిన మిస్టర్‌(Mister) సినిమాలో వీరిద్దరు మొదటిసారిగా కలిసి నటించారు.

కొన్నాళ్ల పాటు రహస్య ప్రేమలో ఉన్న వరుణ్‌తేజ్‌(Varun Tej)- లావణ్య త్రిపాఠిలు(Lavanya Tripati) త్వరలో ఏడడగులు నడవబోతున్నారు. ఇటీవలే వరుణ్‌- లావణ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అసలు వీరు ప్రేమలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ ఎంగేజ్‌మెంట్ చాలా మందికి షాక్‌నిచ్చింది. ఆరేళ్ల కిందట వచ్చిన మిస్టర్‌(Mister) సినిమాలో వీరిద్దరు మొదటిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌ అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడినట్టు లావణ్య తెలిపారు. ఇన్నేళ్లపాటు తమ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్‌ చేశారంటే మెచ్చుకుని తీరాలి. సోషల్‌ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ విషయమైనా ఇట్టే తెలిసిపోతున్నది.

ముఖ్యంగా సెలెబ్రిటీల గురించి చాలా వార్తలు వస్తుంటాయి. కొన్ని కట్టుకథలు కూడా ఉంటాయనుకోండి. అలాంటిది ఆరేళ్లలో వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి గురించి ఒక్క వదంతి కూడా బయటకు రాలేదు. సాధారణంగా వరుణ్‌ తేజ్‌ పెద్దగా ఎక్స్‌పోజ్‌ కారు. తన పనేదో తాను చేసుకుంటూ వెళుతుంటాడు. అందుకే ఎంగేజ్‌మెంట్‌ను కూడా పెద్దగా హడావుడి లేకుండా జరుపుకున్నాడు. జూన్‌ 9న నాగబాబు ఇంట్లో వరణ్‌తేజ్‌, లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబాల సభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ ఏడాది చివరలో వీరి పెళ్లి జరగనుంది. ఇదిలా ఉంటే టైమ్‌ దొరికినప్పుడల్లా ఈ జంట బయట తిరుగుతున్నారు. ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చిన ఈ జంట తాజాగా కాఫీ డేట్‌కు వెళ్లారు.

దీనికి సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) స్టోరీలలో పోస్ట్‌ చేశారు. లావణ్య త్రిపాఠి ఫోటోను వరుణ్ తేజ్‌ తన స్టోరీలో పెట్టిగా.. వరుణ్‌ తేజ్‌ ఫోటోను లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టింది. ఈ ఫోటోలను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ గాండీవధారి అర్జున(Gandivdhari Arjuna) సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. దీనితో పాటుగా ఏయిర్ ఫోర్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా మనుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి తనాల్ అనే తమిళ సినిమా చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 19 July 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story