హీరో వరుణ్‌ తేజ్‌(varun tej), నటి లావణ్య త్రిపాఠి(Lavanya tripati) నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ వేడుక తర్వాత కొంచెం విరామం తీసుకున్నారు. సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉన్నారు.

హీరో వరుణ్‌ తేజ్‌(varun tej), నటి లావణ్య త్రిపాఠి(Lavanya tripati) నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ వేడుక తర్వాత కొంచెం విరామం తీసుకున్నారు. సినిమా చిత్రీకరణలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు సెట్‌లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయన శక్తి ప్రతాప్‌ సింగ్‌(Shakthi pratap singh) దర్శకత్వంలో ఓ ద్విభాష(Dual Language) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌(Sony Pictures International Productions), రినైసన్స్‌ పిక్చర్స్‌(Renaissance Pictures) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రెడీ చేసిన ఓ భారీ సెట్‌లో వరుణ్‌పై యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు. దీనికి నటరాజ్‌ మాస్టర్‌(Natraj Master) నేతృత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు వారాలకు పైగా షెడ్యూల్‌ కొనసాగుతుంది. జులై మొదటి వారంలో ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఎయిర్‌ ఫోర్స్‌(Air Force) యాక్షన్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ శక్తిమంతమైన ఐఎఎఫ్‌(IAF) అధికారిగా కనిపించనున్నారు. మానుషి చిల్లార్‌ (Manushi Chillar)రాడార్‌ ఆఫీసర్‌(radar Officer) పాత్ర పోషిస్తున్నారు.

Updated On 27 Jun 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story