మెగా హీరో వరుణ్‌ తేజ్‌(Varun tej)-లావణ్య త్రిపాఠిలు(Lavanya Tripathi) వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో వైభవోపేతంగా జరిగిన పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో(Mega family) పాటు అల్లు అర్జున్‌(Allu Arjun), నితిన్‌(Nithin) దంపతులు కూడా హాజరయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో(Tuscany) వివాహ వేడుకలు జరిగాయి.

మెగా హీరో వరుణ్‌ తేజ్‌(Varun tej)-లావణ్య త్రిపాఠిలు(Lavanya Tripathi) వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో వైభవోపేతంగా జరిగిన పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో(Mega family) పాటు అల్లు అర్జున్‌(Allu Arjun), నితిన్‌(Nithin) దంపతులు కూడా హాజరయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో(Tuscany) వివాహ వేడుకలు జరిగాయి. తాజాగా కొత్త జంట హైదరాబాద్‌కు చేరుకుంది. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా మెగా కోడలి హోదాలో లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నూతన దంపతులకు అభిమానులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరితో పాటు మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana) కూడా హైదరాబాద్‌కు వచ్చారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల కోసం 5వ తేదీన రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

Updated On 4 Nov 2023 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story