తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి

తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. రజనీకాంత్ భార్య, లత, కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను ఆమె కలిశారు. నికోలాయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి వివాహానికి రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. వరలక్ష్మి వెంట శరత్‌కుమార్, ఆమె తల్లి ఛాయ, సోదరి పూజ ఉన్నారు. రాధికా శరత్‌కుమార్ కూడా ఉన్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్ మార్చి 1న ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ ను నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు వరలక్ష్మి, నికోలాయ్ కుటుంబీకులు హాజరయ్యారు. నికోలాయ్‌కి ఇది రెండో పెళ్లి. అతనికి ఇప్పటికే కుమార్తె ఉంది. కెరీర్ పరంగా వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సంవత్సరం 'హనుమాన్', 'శబరి' చిత్రాల్లో నటించింది. 'హనుమాన్' బ్లాక్ బస్టర్ అయితే, 'శబరి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆమె ధనుష్ 'రాయన్' సినిమాలో కనిపించనుంది.

Updated On 7 Jun 2024 5:13 AM GMT
Yagnik

Yagnik

Next Story