బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(urvashi rautela) ఇటీవల చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తన ట్వీట్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalayn) ని ముఖ్యమంత్రి గా పేర్కొన్నారు, దీంతో నెటిజన్లకు, ట్రోలర్స్ కి కావలసిన సరకు దొరకడంతో ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(urvashi rautela) ఇటీవల చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తన ట్వీట్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalayn) ని ముఖ్యమంత్రి గా పేర్కొన్నారు, దీంతో నెటిజన్లకు, ట్రోలర్స్ కి కావలసిన సరకు దొరకడంతో ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో(BRO) సినిమాలో ఒక పాటలో నటించారు ఊర్వశి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తో పాటు స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా స్టేజ్ పైకి పవన్ కళ్యాణ్ రాగానే అభిమానులు సీఎం, సీఎం అంటూ స్లొగన్స్ ఇచ్చారు.

పాపం దాంతో తికమక పడ్డారో ఏమో కానీ, గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని, మా బ్రో సినిమా ఈ నెల 28 ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఆ రోజు థియేటర్లు ల కలుద్దాం అని ట్వీట్(tweet) చేసారు ఊర్వశి.

ఛాన్స్ దొరికితే నెటిజనులు ఊరుకుంటారా, తమ పని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్య మంత్రి తో సరి పెడితే ఎలా, ఆయనకి ప్రధాని పదవి ఇవ్వచ్చుకదా, అని కొందరు, ఈ ట్వీట్ తో పాపం ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఎలా ఫీల్ అవుతున్నారో అని మరో నెటిజెన్ కామెంట్ చేసారు.

Updated On 27 July 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story