దర్శకుడు రాంగోపాల్‌వర్మ(RGV) ఏపీ డీజీపీని కలిశారు. టీవీ5 ఎండీ బి.ఆర్‌.నాయుడు, సాంబశివరావు, టీడీపీ నేత కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని(DGP) రాంగోపాల్‌వర్మ కోరారు. తనను చంపేందుకు టీవీ డిబేట్‌లో డైరెక్ట్‌గా ఓ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. యాంకర్‌ సాంబశివరావు వారించిన కొలికపూడి అదే విషయాన్ని పలు సార్లు ప్రస్తావించాడని వర్మ అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర పన్నినవారిలో సాంబశివరావు(TV5 Sambasivarao), కొలికపూడి పాత్ర ఉందని ఆరోపించారు.

దర్శకుడు రాంగోపాల్‌వర్మ(RGV) ఏపీ డీజీపీని కలిశారు. టీవీ5 ఎండీ బి.ఆర్‌.నాయుడు, సాంబశివరావు, టీడీపీ నేత కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని(DGP) రాంగోపాల్‌వర్మ కోరారు. తనను చంపేందుకు టీవీ డిబేట్‌లో డైరెక్ట్‌గా ఓ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. యాంకర్‌ సాంబశివరావు వారించిన కొలికపూడి అదే విషయాన్ని పలు సార్లు ప్రస్తావించాడని వర్మ అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర పన్నినవారిలో సాంబశివరావు(TV5 Sambasivarao), కొలికపూడి పాత్ర ఉందని ఆరోపించారు. టీవీ5 చర్చలోనే నన్ను చంపాలని కోరారు.. ఈ కుట్రలో చానెల్‌ ఎండీకి కూడా కుట్ర ఉందన్నారు. కొలికపూడి ఇలాంటి వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఖండించలేదన్నారు. వ్యూహం సినిమాకు టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. గుమ్మడి కాయల దొంగలు ఎవరంటే టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని వర్మ అన్నారు. తనను చంపాలని( Sketch to Murder) బహిరంగంగానే వ్యాఖ్యానించిన కొలికపూడి, ఈ కుట్రలో ఉన్న సాంబశివరావు, టీవీ5 ఎండీ బి.ఆర్.నాయుడిపై(BR Naidu) చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాంగోపాల్‌ వర్మ విజ్ఞప్తి చేశారు.

Updated On 27 Dec 2023 7:43 AM GMT
Ehatv

Ehatv

Next Story