ఆరు నూరైనా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ చేయాలనే పట్టుదలతో దర్శకుడు త్రివిక్రమ్‌(Trivikram) ఉన్నాడు. సంక్రాంతి పండుగకు గుంటూరు కారం(Guntur Karam) వచ్చి తీరుతుందని చెప్పిన త్రివిక్రమ్‌ ఆ పనులతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో చాలా స్పీడ్‌గా జరుగుతోంది.

ఆరు నూరైనా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ చేయాలనే పట్టుదలతో దర్శకుడు త్రివిక్రమ్‌(Trivikram) ఉన్నాడు. సంక్రాంతి పండుగకు గుంటూరు కారం(Guntur Karam) వచ్చి తీరుతుందని చెప్పిన త్రివిక్రమ్‌ ఆ పనులతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో చాలా స్పీడ్‌గా జరుగుతోంది. బుధవారం ఓ స్టార్‌ హోటల్‌లో మహేశ్‌బాబు(Mahesh), ప్రకాశ్‌రాజ్‌(Prakashraj) తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాడు త్రివిక్రమ్‌. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇందులో శ్రీలీల(Sreeleela) కథానాయిక. మరో పాత్రలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary) నటిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో స్పెషల్‌ కామియో రోల్‌లో కనిపిస్తారనే టాక్‌ నడుస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్‌ నేపథ్యలో ఈ సినిమా నడుస్తుందని కొందరు అంటున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌(Harika and Hasini Creations) పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న సినిమాల్లో ఇదొకటి. మహేశ్‌ - త్రివిక్రమ్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవర్‌ 13న సినిమా విడుదల కానుంది.

Updated On 14 Sep 2023 3:31 AM GMT
Ehatv

Ehatv

Next Story