ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. కొత్త కథలకంటే.. ఎక్కువగా సీక్వెల్ సినిమాలు, రీమేక్ లు, డబ్బింగ్ సినిమాల హవానే ఎక్కువగా నడుస్తోంది. ఈక్రమంలో హీరోయిన్ త్రిష చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ త్రిష ఏమంటుందంటే..?

ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. కొత్త కథలకంటే.. ఎక్కువగా సీక్వెల్ సినిమాలు, రీమేక్ లు, డబ్బింగ్ సినిమాల హవానే ఎక్కువగా నడుస్తోంది. ఈక్రమంలో హీరోయిన్ త్రిష చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ త్రిష ఏమంటుందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), త్రిష (Trisha) జంటగా న‌టించిన సినిమా ఆడవారి మాటలకు అర్దాలే వేరులే (Aadavari Matalaku Arthale Verule).తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) డైరెక్ట్ చేసిన ఈసినిమా 2007లో విడుదలై భారీ హీట్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్ఫకుల మను దోచుకుంది. ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు.. కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలగలిపి ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) మ్యూజిక్.. అప్పట్లోమ్యాజిక్ చేసి అందరిని కట్టిపడేసింది. ఈసినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా మిగిలాయి.ఇక ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గత కొంత కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈట్రెండ్ బాగా నడుస్తున్నది. తాజాగా ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమాకు కూడా సీక్వెల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా ఆ సినిమా హీరోయిన్ త్రిష హిట్ ఇచ్చింది.

దర్శకుడు సెల్వ రాఘవన్ ట్వీట్ చేస్తూ.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే (AMAV) సినిమా మళ్ళీ చూశాను. వెంకటేష్ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు. ఈ ట్విట్ చేసి పది సంవత్స‌రాలు అయ్యింది. అయితే ఈ ట్విట్‌ను త్రిష కృష్ణ‌న్.. నిన్న రీ ట్వీట్ చేస్తూ.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా సీక్వెల్ కి నేను రెడీ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఇక దీనిపై సెల్వ రాఘవన్, విక్టరీ వెంకటేష్ ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.

Updated On 12 Sep 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story