రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా అలరించడం అంత ఈజీ కాదు. మామూలుగా అయితే పదేళ్లకు మించి హీరోయిన్ల కెరీర్‌ ఉండదు. కానీ త్రిష(Trisha) మాత్రం 20 ఏళ్లుగా హీరోయిన్‌గానే ఉంటూ వస్తున్నారు. వర్షం సినిమాలో ఎంత అందంగా ఉన్నారో, ఇప్పుడూ అదే అందంతో మెరిసిపోతున్నారు. కెరీర్‌ మొదల్లో పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగువారికి పరిచయం అయిన త్రిష 2003లో నీ మనసు నాకు తెలుసు అనే స్టయిట్‌ సినిమాను చేశారు.

రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా అలరించడం అంత ఈజీ కాదు. మామూలుగా అయితే పదేళ్లకు మించి హీరోయిన్ల కెరీర్‌ ఉండదు. కానీ త్రిష(Trisha) మాత్రం 20 ఏళ్లుగా హీరోయిన్‌గానే ఉంటూ వస్తున్నారు. వర్షం సినిమాలో ఎంత అందంగా ఉన్నారో, ఇప్పుడూ అదే అందంతో మెరిసిపోతున్నారు. కెరీర్‌ మొదల్లో పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగువారికి పరిచయం అయిన త్రిష 2003లో నీ మనసు నాకు తెలుసు అనే స్టయిట్‌ సినిమాను చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మధ్యలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పరాజయాలు పలకరిస్తున్న సమయంలో ఆమెకు ఓ బ్రహ్మండమైన హిట్టు పడేది. ఆ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేవారు త్రిష. నాలుగు పదుల వయసు దాటినా ఆమె అందం ఏ మాత్రం తరగలేదు. వయసు పెరిగేకొద్ది బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరిస్తున్నారు. అవి కూడా మామూలు ప్రాజెక్టులేమీ కావు.
ప్రస్తుతం త్రిష నటిస్తున్న సినిమాలు చూస్తుంటే యంగ్‌ హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం త్రిష అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. అందులో నాలుగు స్టార్‌ హీరోల సినిమాలే. అందులో దసరాకు రిలీజయ్యే లియో(Leo) ఒకటి. ఈ సినిమాలో విజయ్‌కు(Vijay) జోడీగా త్రిష నటిస్తున్నారు. ఇక అజిత్(ajith) హీరోగా నటిస్తున్నవిడాముయిర్చిలో(vidamuyirchi) త్రిషనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటితో పాటుగా కమల్‌-మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ త్రిషనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక దృశ్యం సిరీస్‌ దర్శకుడు జీతూ జోసెఫ్‌, మోహన్‌లాల్‌తో తీయబోయే రామ్‌ సినిమాలోనే త్రిషనే నటిస్తున్నారు. ఇలా మొత్తంగా ఓ స్టార్‌ లైనప్‌ను సెట్‌ చేసుకున్నారు. ఓ వైపు సీనియర్‌ హీరోలతో జోడీ కడుతూనే మరో వైపు విజయ్‌ వంటి స్టార్‌ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తర్వాతి సినిమాలో కూడా త్రిష కథానాయికగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటికి మొన్న ఈ అందాల భామ పదేళ్ల తర్వాత సెల్వా రాఘవన్‌ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చి వార్తల్లో నిలిచారు. పదేళ్ల కిందట ఆడవారి మాటలకు అర్దాలే వేరులో సినిమా చూసిన సెల్వా రాఘవన్‌.. ఈ సినిమా తనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని.. అవకాశమొస్తే వెంకటేశ్‌, త్రిషతో సీక్వెల్‌ చేయాలనుకుంటున్నానని 2013లో ఓ ట్వీట్‌ చేశారు. దానికి త్రిష ఇప్పుడు నేను రెడీ అంటూ బదులిచ్చారు.

Updated On 13 Sep 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story