బూరుగుపల్లి శివరామకృష్ణ. తెలుగు సినిమా అభిమానులకు ఈ పేరు తెలిసే ఉంటుంది. ఆయన ప్రముఖ నిర్మాత.

బూరుగుపల్లి శివరామకృష్ణ. తెలుగు సినిమా అభిమానులకు ఈ పేరు తెలిసే ఉంటుంది. ఆయన ప్రముఖ నిర్మాత. సాహసవీరుడు సాగరకన్య(sagarakanya), ప్రేమంటే ఇదేరా(Premante Edhera), యువరాజు(Yuvaraju), దరువు(Daruvu), శ్రీరామ్‌(Sriram) వంటి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకంటే ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు శివరామకృష్ణను(Siva Ramakrishna), ఆయనకు సహకరించిన ఆర్కియాలజీ (Archives and Research Institute) డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌(ChandraShekar), బిల్డర్‌ లింగం గౌడ్‌(Lingam Goud)లను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్‌ 46లో 83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని శివరామకృష్ణ కబ్జా చేశారని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జరీనా పర్వీన్‌ ఈ ఏడాది ఆగస్టులో సీసీఎస్‌(CCS)లో ఫిర్యాదు చేశారు. దీనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. భూ కబ్జా కేసు కావడంతో దానిని ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఓయూ పోలీసులు నిందితులను ఈ నెల 17వ తేదీన అరెస్టు చేశారు. ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌లో బహమనీ, దక్కన్‌ రాజవంశాలతో పాటు.. కుతుబ్‌షాహీ, ఆదిలా షాహీ, షాజహాన్‌ చక్రవర్తి కాలం నుంచి మెఘలులు, అసఫ్‌ జాహీల వరకు దాదాపు 43 మిలియన్ల విలువైన రికార్డులను కలిగి ఉంది. రికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో రాయదుర్గంలోని 83 ఎకరాలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో 10 ఎకరాల భూమికి సంబంధించిన పహాణీ, సేత్వార్‌లు కనిపించకుండా పోయాయి. ఈ భూములను కూడా సినీ నిర్మాత శివరామృష్ణ కబ్జా చేసినట్లు గుర్తించారు. డిపార్టుమెంట్‌లో 1993 నుంచి రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌ను శివరామకృష్ణ మచ్చిక చేసుకొని.. అతని సహకారంతో రికార్డుల్లోని పత్రాలను మాయం చేసినట్లు 2003లో గుర్తించారు. దాంతో అప్పటి ప్రభుత్వం చంద్రశేఖర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు.. ఉన్నత న్యాయస్థానంలో కేసు వేసింది. అయితే చంద్రశేఖర్‌ ద్వారా పత్రాలు కొట్టేసిన శివరామకృష్ణ ప్రముఖ బిల్డర్‌ అయిన మారగోని లింగం గౌడ్‌ సహకారంతో వాటిని తన పేరున మార్చుకొని నకిలీ పత్రాలు సృష్టించి ఆ 83 ఎకరాల భూమి తనదేనని పత్రాలను కోర్టుకు సమర్పించాడు. కొన్నేళ్లుగా న్యాయస్థానంలో ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం సుప్రీం కోర్టు శివరామకృష్ణను దోషిగా తేల్చింది. ప్రస్తుతం అక్కడ భూమి ధర ఎకరం 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ లెక్కన రూ.8,300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఈ కబ్జా పథకంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరి పాత్ర ఏంటి? అని తేల్చే పనిలో ఓయూ పోలీసులు నిమగ్నమయ్యారు. యాచారంలో కబ్జాకు గురైన 10 ఎకరాలపై కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇలా భూముల కోసం డబ్బులు ఇచ్చిన వారో లేదా అగ్రిమెంట్ లు చేసుకున్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు(Daggupati Suresh babu), ఫైనాన్సియర్ సత్య రంగయ్య (Sathya rangaiah)లాంటి పెద్దలు పలువురు ఉన్నారని అంటున్నారు. సమగ్ర దర్యాప్తు జరిగితే ఇది నిజమో కాదో తెలుస్తుంది.

ehatv

ehatv

Next Story