రాడిసన్‌ డ్రగ్‌ కేసులో(Radisson Drug case) అనుమానితుడిగా ఉన్న సినిమా దర్శకుడు క్రిష్‌(Krish) హైకోర్టులో(High court) ముందస్తు బెయిల్‌(Anticiptory bail) కోసం పిటిషన్‌ వేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి(Raghu charan atluri), సందీప్‌లు(Sandeep) కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.

రాడిసన్‌ డ్రగ్‌ కేసులో(Radisson Drug case) అనుమానితుడిగా ఉన్న సినిమా దర్శకుడు క్రిష్‌(Krish) హైకోర్టులో(High court) ముందస్తు బెయిల్‌(Anticiptory bail) కోసం పిటిషన్‌ వేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి(Raghu charan atluri), సందీప్‌లు(Sandeep) కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్‌ తీసుకునే ప్రయత్నాలలో ఉన్నారట! కొకైన్‌ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్‌ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుమానితులుగా ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌, చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్‌ ఇళ్లకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అంటించారు. రఘుచరణ్‌ అట్లూరిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. తర్వాత అతడిని వైద్యపరీక్షలకు తరలించారు. ఇక సైంధవ్‌ నిర్మాత బోయినపల్లి వెంకట్‌ కుమారుడు నీల్‌ విదేశాలకు చెక్కేశాడు. అతడికి అమెరికా పౌరసత్వం ఉందట! కొకైన్‌ తీసుకున్నట్లు పోలీసులు అనుమానించడంతో అతడు దేశం విడిచి పరారయ్యాడు. ఇక సందీప్‌, శ్వేత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయి ఉన్నాయి. నటి కుషిత సోదరి లిషి ఏమో ఇంటికే రావడం లేదట!

Updated On 1 March 2024 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story