టాలీవుడ్ అగ్ర‌ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) కారులో చోరీ జరిగింది. కారు అద్దం పగులగొట్టిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నగదుతో పాటు ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాలీవుడ్ అగ్ర‌ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) కారులో చోరీ జరిగింది. కారు అద్దం పగులగొట్టిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నగదుతో పాటు ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) జర్నలిస్టు కాలనీలోని(Journalist Colony) బెల్లంకొండ సురేష్ కార్యాలయం ఎదుట‌ గురువారం మధ్యాహ్నం ఆయ‌న బెంజ్‌ కారును పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా కారు వెనుక సీటు అద్దం పగిలి ఉంది. కారు లోపల ఉంచిన రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. మద్యం సీసాల ధర 28వేలు వరకు ఉంటుందని సమాచారం. నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది, సురేష్ సతీమణి పద్మావతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 10 Jun 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story