రాంగోపాల్‌వర్మ (Ramgopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyuham) సినిమాపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్.

రాంగోపాల్‌వర్మ (Ramgopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyuham) సినిమాపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్. సినిమా విడుదలపై నేడు తెలంగాణ హైకోర్టులో (Telangna Highcourt) విచారణ కొనసాగింది. వ్యూహం విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సినిమా విడుదలపై జనవరి 22న తుది తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు సినిమా విడులపై స్టే ఉంటుందని హైకోర్టు తెలిపింది. దీంతో మరోసారి వ్యూహం సినిమాకు బ్రేకులు పడ్డట్లేనని భావిస్తున్నారు.

ఈ సినిమాలో చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌లను (Pawan Kalyan) కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ లోకేశ్ కోర్టుకు (Nara Lokesh) వెళ్లారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు.

Updated On 12 Jan 2024 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story