స్టార్‌ హీరోయిన్‌ సమంతకు(samantha) ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూలో నిల్చున్నారు. ఇటీవల వచ్చిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పైగా అభిమానులను కూడా నిరాశపర్చింది. బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. అయినప్పటికీ సమంత డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

స్టార్‌ హీరోయిన్‌ సమంతకు(samantha) ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూలో నిల్చున్నారు. ఇటీవల వచ్చిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పైగా అభిమానులను కూడా నిరాశపర్చింది. బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. అయినప్పటికీ సమంత డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో(Vijay Devarkonda) కలిసి ఖుషీ(kushi) సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటుగా ఇండియా వర్షన్ సిటాడెల్‌లో(Citadel) కనిపించనుంది. ఇంగ్గీష్‌లో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) వేసిన పాత్రను ఇండియా వర్షన్‌లో సమంత పోషిస్తున్నారు. సిటాడెల్ చివరి షెడ్యూల్ ముగించుకున్న సమంత తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కాసింత డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. చాలా భిన్నమైన డ్రస్‌లో వచ్చిన సమంత అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఆమె వేసుకున్న చెప్పులపైనే అందరి దృష్టి పడింది. నెటిజన్లు ఈ ముచ్చటనే చర్చించుకుంటున్నారు. సమంత చాలా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నారని, వాటి ధర ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. వారు అనుకున్నట్టుగానే సమంత వేసుకున్న చెప్పులు చాలా విలువైనవి. ఎంత విలువైనవి అంటే 2,58,097 రూపాయలంత విలువ. ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయట. ఈ చెప్పుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. లేటెస్ట్‌ లుక్‌లో సమంత ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటున్నారు నెటిజన్స్.

Updated On 30 May 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story