బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ప్రారంభమయ్యి అప్పుడే మూడు వారాలు గడుస్తున్నాయి. మొన్నే మొదలైట్టుగా ఉంది. ఇప్పుడు ఆ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకే నెమ్మదిగా షో పట్ల ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 19వ రోజు ఏం జరిగిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం! మొదటి రెండు వారాలలో పవరస్త్రను సందీప్‌, శివాజీ గెల్చుకున్నారు కదా! మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ప్రారంభమయ్యి అప్పుడే మూడు వారాలు గడుస్తున్నాయి. మొన్నే మొదలైట్టుగా ఉంది. ఇప్పుడు ఆ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకే నెమ్మదిగా షో పట్ల ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 19వ రోజు ఏం జరిగిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం! మొదటి రెండు వారాలలో పవరస్త్రను సందీప్‌, శివాజీ గెల్చుకున్నారు కదా! మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చొని ప్రిన్స్‌ యవర్‌, బాగా కారంగా ఉన్న చికెన్‌ ముక్కలను తిని శోభా షెట్టి, జుట్టును కత్తిరించుకుని ప్రియాంక ఫైనల్‌ త్రీలో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్‌ మొదలవడమే బిగ్‌బాస్‌ ఫిట్టింగ్‌తో మొదలయ్యింది. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో వారే డిసైడ్‌ చేసుకోవాలని బిగ్‌బాస్‌ చెప్పడంతో ఆ ముగ్గురు బిత్తరపోయారు. పక్కకు తప్పుకునే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు చర్చించుకున్నారు. ఈ క్రమంలో యవర్‌ పేరును శోభాషెట్టి, శోభాషెట్టి పేరును యవర్‌ చెప్పారు. అలా చెప్పిన సమయంలోనే ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ గొడవపడ్డారు. ఇక నిర్ణయాత్మక ఓటును వేయాల్సిన ప్రియాంక , శోభాషెట్టి పేరు చెప్పింది. అలాగే టేబుల్‌పై ఉన్న యవర్‌ బొమ్మను ఇద్దరూ కలిసి సుత్తితో పగలగొట్టారు. తనను పక్కకు జరపడాన్ని సహించలేకపోయిన యవర్‌ అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్‌ను విరగొట్టాడు. మొదట హౌస్‌ అంతా అరుస్తూ తిరిగిన యవర్‌(Yawar) కాసేపయ్యాక ఏడవడం మొదలుపెట్టాడు. శివాజీ(Shivaji) దగ్గర కూర్చుని తన బాధలు చెప్పుకున్నాడు. ఉద్యోగం లేదని, చాలాసార్లు జేబులో వంద రూపాయలు కూడా ఉండేవి కావని, అందుకే తనకు కోపం, ఆకలి ఎక్కవ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు యవర్‌. తనకు సరైన న్యాయం దొరకడం లేదని బాధపడ్డాడు.
చివరగా ప్రియాంక(Priyanka)-శోభాశెట్టి(Shobha Shetty) మధ్య బుల్ ఫైట్(Bull Fight) పోటీ పెట్టాడు బిగబాస్‌. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.బుల్‌పై తాడుని పట్టుకుని పడుకున‍్న పొజిషన్‌లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాషెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్‌లో బుల్‌పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరిలో ప్రియాంకనే గెలిచినట్టు కనిపించింది. అయితే విజేత ఎవన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌గానే ఉంది. విజేత ఎవరన్నది వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున(Nagarjuna) ప్రకటిస్తాడని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

Updated On 23 Sep 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story