బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌పై(Bigg Boss 7) నెమ్మదిగా ఆసక్తి పెరుగుతోంది. రెండో వారం నామినేషన్స్‌ హడావుడితో హౌస్‌ అంతా గోలగోలగా మారింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు కొట్టుకుంటారేమోనన్నంతగా సీన్‌ క్రియేట్‌ చేశారు. అంత ఆవేశంతో ఉన్న కంటెస్టెంట్లు సడన్‌గా మారిపోయాయి. అందుకు కారణం బిగ్‌బాస్‌ మాయా అస్త్ర అంటూ ఓ పోటీ పెట్టడమే.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌పై(Bigg Boss 7) నెమ్మదిగా ఆసక్తి పెరుగుతోంది. రెండో వారం నామినేషన్స్‌ హడావుడితో హౌస్‌ అంతా గోలగోలగా మారింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు కొట్టుకుంటారేమోనన్నంతగా సీన్‌ క్రియేట్‌ చేశారు. అంత ఆవేశంతో ఉన్న కంటెస్టెంట్లు సడన్‌గా మారిపోయాయి. అందుకు కారణం బిగ్‌బాస్‌ మాయా అస్త్ర అంటూ ఓ పోటీ పెట్టడమే. బుధవారం ఈ ఆటను పూర్తి చేశారు కంటెస్టెంట్లు. మాయ అస్త్ర టాస్క్‌లో భాగంగా మంగళవారం పెట్టిన పుల్ రాజా పుల్ గేమ్‌లో రణధీర సమూహం అంటే శివాజీ(Shivaji), అమర్‌దీప్‌(Amardeep), ప్రిన్స్‌(Prince), ప్రియాంక(Priyanka), శోభాషెట్టి(Shobha Shetty), షకీలా(Shakila) గెలిచారు. విజేతలకు బిగ్‌బాస్‌ ఓ తాళం చెవిని ఇచ్చాడు. దీంతో మంగళవారం ఎపిసోడ్‌ ముగిసింది. దాన్ని దొంగలించాలని మహాబలి టీమ్‌ ప్లాన్‌ చేయడంతో బుధవారం ఎపిసోడ్‌ ప్రారంభమయ్యింది. తాళం చెవిని సంపాదించమని చెప్పారు కానీ దొంగతనం చేయవద్దని చెప్పలేదుగా అని తేజ ముందు అనుమానపడ్డాడు. దీంతో తాళంచెవిని దొంగలిద్దామని గౌతమ్‌ అన్నాడు. అప్పటికే రాత్రి అయిపోవడంతో అందరూ నిద్రపోయారు. మహాబలి టీమ్‌ అంటే రతిక, శుభశ్రీ, గౌతమ్‌, తేజ, దామిని, ప్రశాంత్‌ మాత్రం మెలకువతోనే ఉన్నారు. రణధీర గ్రూప్‌ దగ్గర ఉన్న తాళం చెవిని ఎలాగైనా కొట్టేయాలని రాత్రంతా ట్రై చేశారు. ఈ తరుణంలోనే మలుపులో గెలుపు అంటూ బిగ్‌బాస్‌ రెండు గ్రూపులకు మధ్య మరో గేమ్‌ పెట్టాడు. ఇందులో భాంగా సందీప్‌ ఓ చక్రంలో ఉన్న పుల్లని తిప్పుతాడు. అది ఏ రంగు మీద వచ్చి ఆగుతుందో పోటీపడుతున్న కంటెస్టెంట్స్‌ తమ ఎదురుగా బల్లపై ఉన్న సర్కిల్స్‌లో ఆ కలర్‌పై చేతులు లేదా కాలు పెట్టాలి. ఇందులో ఎవరైతే ముందు తప్పు చేస్తారో వారు ఓడిపోయినట్టు. మొదట గౌతమ్‌ప ప్రియాంక గెలిచింది. తర్వాత శోభాషెట్టిపై ప్రశాంత్‌ విజయం సాధించారు. అలా తొలి గేమ్‌లో గెలిచిన రణధీర్‌ టీమ్‌ మళ్లీ రెండు పాయింట్లతో ఈ పోటీనూ గెలిచింది. ఇక తాళం చెవిని దొంగలించలేకపోయిన మహాబలి జట్టు సభ్యులు సందీప్‌ గెల్చుకున్న పవర్‌ అస్త్ర దొంగలించారు. మరోవైపు తెలుగులో కాకుండా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నందుకు ప్రిన్స్‌కు బిగ్‌బాస్ చిన్నపాటి శిక్ష విధించాడు. పాపం లాన్‌ ఏరియాలో ఇంట్లో ఉన్నంత కాలం తెలుగులోనే మాట్లాడుతాను అనే పేరాను మళ్లీ మళ్లీ చాలా సేపు చదువుతూనే ఉన్నాడు. ప్రిన్స్‌ దగ్గరే తాళం చెవి ఉందన్న విషయం తెలుసుకున్న మహాబలి టీమ్‌ అతడు చదువుతున్నప్పుడు బాగా ఇబ్బంది పెట్టింది. రెండు పోటీల్లోనూ విజేతలుగా నిలిచిన రణధీర్ సమూహానికి బిగ్‍‌బాస్ మాయ అస్త్ర ఇచ్చాడు. అందులో ఆరు భాగాల్ని గ్రూపులో ఉన్న ఆరుగురు పంచుకున్నారు. వీళ్లందరూ పవర్ అస్త్ర పోటీలో ఉంటారని బిగ్‌బాస్ గుర్తు చేశాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.

Updated On 14 Sep 2023 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story