నాలుగు రోజుల కిందట సిక్కిం(Sikkim)లో సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళకుమారి(Sarala Kumari) ఆచూకీ గల్లంతయ్యింది. ప్రస్తుతం ఆమె కూతురు నబిత అమెరికాలో ఉంటున్నారు. తన తల్లి జాడను కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి వేడుకుంటున్నారు నబిత.

నాలుగు రోజుల కిందట సిక్కిం(Sikkim)లో సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళకుమారి(Sarala Kumari) ఆచూకీ గల్లంతయ్యింది. ప్రస్తుతం ఆమె కూతురు నబిత అమెరికాలో ఉంటున్నారు. తన తల్లి జాడను కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి వేడుకుంటున్నారు నబిత. ఎన్టీఆర్‌ నటించిన దాన వీర శూర కర్ణ, చిరంజీవి హీరోగా వచ్చిన సంఘర్షణ వంటి సినిమాల్లో నటించిన సరళకుమారి మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ టైటిల్‌ను కూడా గెల్చుకున్నారు. ప్రస్తుతం హైటెక్‌ సిటీలో నివాసం ఉంటున్న సరళకుమారి అక్టోబర్‌ 2వ తేదీన తన స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. తన పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న తన కూతురు నబితకు కూడా చెప్పారు. అయితే సిక్కింలో అకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళకుమారి జాడ కనిపించకుండా పోయింది. అక్టోబర్‌ 3వ తేదీన సరళకుమారితో ఆమె కూతురు మాట్లాడారట! ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారమూ లేదని నబిత చెబుతున్నారు. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించానని, అవి కూడా పని చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు నబిత. దయచేసి తన తల్లి ఆచూకిని కనిపెట్టండి అంటూ తెలంగాణ సర్కారును వేడుకుంటున్నారు. సిక్కింలో సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు 53 మంది చనిపోయారు. 142 మంది గల్లంతయ్యారు.

Updated On 7 Oct 2023 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story