బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనంతరం హీరో అయిన అతి కొద్ది మందిలో తరుణ్‌(tharun) ఒకరు. మనసు మమత(Manasu mamatha) సినిమాతో తరుణ్‌ సినీ కెరీర్‌ మొదలయ్యింది. ఆ తర్వాత పది పన్నెండు(Padhi panendu) సినిమాలలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాడు. మణిరత్నం తీసిన అంజలి(Anjali) చిత్రం తరుణ్‌కు మంచి పేరును తెచ్చింది.

బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనంతరం హీరో అయిన అతి కొద్ది మందిలో తరుణ్‌(tharun) ఒకరు. మనసు మమత(Manasu mamatha) సినిమాతో తరుణ్‌ సినీ కెరీర్‌ మొదలయ్యింది. ఆ తర్వాత పది పన్నెండు(Padhi panendu) సినిమాలలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాడు. మణిరత్నం తీసిన అంజలి(Anjali) చిత్రం తరుణ్‌కు మంచి పేరును తెచ్చింది. నువ్వే కావాలి(Nuve kavali) సినిమాతో హీరో అయ్యాడు తరుణ్‌. మొదటి సినిమాతోనే స్టార్‌ స్టేటస్‌ను సంపాదించాడు. పలు చోట్ల ఈ సినిమా గోల్డెన్‌ జూబ్లీ జరుపుకుంది. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణం వ్యాపరరంగంలో తీరిక లేకుండా ఉండటమే. త్వరలోనే తరుణ్‌ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త వినిపిస్తోంది. దాంతో పాటు అతడి పెళ్లి గురించి కూడా వదంతులు వచ్చాయి.

లేటెస్ట్‌గా తరుణ్‌ తల్లి, నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ రోజా రమణి(Roja ramani) స్పందించారు. తరుణ్‌పై వస్తున్న పుకార్లు తనను ఎంతగానో బాధించాయని అన్నారు. త్వరలోనే తరుణ్‌ సినిమాలలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పారు. ఒక వెబ్‌ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడని రోజారమణి తెలిపారు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్‌ అవుతుందో చెప్పలేనని, ప్రేక్షకుల ఆశిస్సులతో తరుణ్‌ తప్పకుండా మళ్లీ హీరోగా రాణిస్తాడని రోజారమణి చెప్పారు. తరుణ్‌కు తనకంటే భక్తి ఎక్కువని చెబుతూ రోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడని, ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడని రోజారమణి అన్నారు. శని, మంగళవారాలు మాంసాహారం ముట్టుకోడని, మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్‌ తింటాడని తెలిపారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నామని, తరుణ్‌ పెళ్లి ఒక్కటి అయితే చాలని, అంతకు మించింది ఏది లేదని రోజారమణి పేర్కొన్నారు.

Updated On 16 May 2023 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story