రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు చకచకా కానిచ్చేస్తున్నారు భోళా శంకర్(Bhola shankar) టీమ్. తాజాగా హీరోయిన్ తమన్నా(Tamannaah) తన పని తాను కంప్లీట్ చేసేసింది. ఓ పోస్ట్ కూడా పెట్టేసింది.

రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు చకచకా కానిచ్చేస్తున్నారు భోళా శంకర్(Bhola shankar) టీమ్. తాజాగా హీరోయిన్ తమన్నా(Tamannaah) తన పని తాను కంప్లీట్ చేసేసింది. ఓ పోస్ట్ కూడా పెట్టేసింది.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) , తమన్నా(Tamannaah) జంటగా.. మోహార్ రమేష్(Meher Ramesh) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా భోళా శంకర్. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy suresh) చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈసినిమాలో హీరో సుశాంత్(sushanth) ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం(Vedalam) కు తెలుగు రీమేక్ గా ఈమూవీ తెరకెక్కుతోంది. ఈమధ్యే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న టీమ్.. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే తన డబ్బింగ్ పార్ట్ ను మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ చేయగా.. తాజాగా హీరోయిన్ తమన్నా తన క్యారెక్టర్ కు డబ్బింగ్ ను పూర్తి చేసింది.

డబ్బింగ్‌(Dubbing) సహా పలు ప్యాచ్‌ వర్కులను కంప్లీట్‌ చేసుకుంటున్నారు భోళా టీమ్... ఇప్పటికే రిలీజైన టీజర్‌ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వింటేజ్‌ బాస్‌ను చూడబోతున్నామనే ఫీల్‌తో ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భోళా శంకర్‌ సినిమాకు డబ్బింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుందని, ఈ సినిమాలో చిరుకు, తమన్నాకు మధ్య సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయని వెల్లడించాడు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడీయోలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నాడు.

ఇక రీసెంట్ గా మెగాస్టార్‌ చిరు, కీర్తి సురేష్ డబ్బింగ్‌ పార్ట్‌ను కంప్లీట్‌ చేసుకున్నారు. ఇక రీసెంట్‌గా రిలీజైన మిల్కీ బ్యూటీ సాంగ్‌ వీళ్ల జోడీ బాగా సెట్‌ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ముందు ముందు మరిన్ని అప్ డేట్స్ కు రెడీ అవుతున్నారు భోళా శంకర్ టీమ్. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్‌ సుంకర నిర్మించాడు. ఫెయిల్యూర్స్ తో పాటు.. చాలా కాలం సినిమాలకు గ్యాప్ఇచ్చిన మెహర్ రమేష్ ఈమూవీని ఏం చేస్తాడో చూడాలి.

Updated On 23 July 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story