మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia), బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ(Vijay Varma) ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్‌ స్టోరీస్‌ 2(Lust Stories) వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. లేటెస్ట్‌గా ఈ ప్రేమజంట ముంబాయిలో కనిపించారు. ఈ ప్రేమపక్షులు ఒకరినొకరు చేతులు పట్టుకుని కెమెరాల కంటికి దొరికారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట కారులో వెళుతూ చాలా ఉత్సాహంగా అభిమానులను పలకరించారు.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia), బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ(Vijay Varma) ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్‌ స్టోరీస్‌ 2(Lust Stories) వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. లేటెస్ట్‌గా ఈ ప్రేమజంట ముంబాయిలో కనిపించారు. ఈ ప్రేమపక్షులు ఒకరినొకరు చేతులు పట్టుకుని కెమెరాల కంటికి దొరికారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట కారులో వెళుతూ చాలా ఉత్సాహంగా అభిమానులను పలకరించారు.

ఇది చూసిన నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్‌ జంట ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మీ జోడి చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంది. దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి అని ఓ ఫ్యాన్‌ రాశారు. వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఇంకొకరు ఈ జంట చాలా అందంగా కనిపిస్తున్నరని వ్యాఖ్యానించాడు. కాగా, గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట తొలిసారిగా లస్ట్‌ స్టోరీస్‌-2లో కలిసి నటించారు. తమన్నాతో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నానని విజయ్‌ వర్మ చెప్పుకొచ్చారు.

ఆమె రాకతో తన జీవితంలో విలన్‌ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్‌ స్టేజ్‌ మొదలయ్యిందని అన్నాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు విజయ్‌వర్మ తెలిపాడు. ఇక సినిమాల విషయానికి వస్తే తమన్నా ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన జైలర్‌లో నటిస్తున్నారు. దీనికి నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంవహిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణన్‌, యోగిబాబు, వసంత్‌ రవి, వినాయకన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు విజయ్ వర్మ ఇటీవలే కాలకూట్‌లో నటించారు. ఇందులో శ్వేతా త్రిపాఠిశర్మ హీరోయిన్‌గా నటించింది. సుమిత్ సక్సేనా దర్శకత్వం వహించాడు. యశ్‌పాల్ శర్మ, గోపాల్ దత్, సీమా బిస్వాస్ కూడా నటించారు. ఇప్పుడు సుజోయ్ ఘోష్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు.

Updated On 1 Aug 2023 5:49 AM GMT
Ehatv

Ehatv

Next Story