బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ మీటూ ఉద్యమానికి ఓ రకంగా ఆద్యురాలేనని చెప్పాలి. అప్పట్లో స్వరభాస్కర్‌(Swarabhaskar) పలికిన ప్రతి మాట ఓ తూటాలా పేలింది. ఆమె సమాజ్‌ వాదీ పార్టీ నేత ఫహద్‌ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వారు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్‌ ఈ మధ్యనే సీమంతం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఆమఎ పండంటి బిడ్డకు జన్మనించారు.

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ మీటూ ఉద్యమానికి ఓ రకంగా ఆద్యురాలేనని చెప్పాలి. అప్పట్లో స్వరభాస్కర్‌(Swarabhaskar) పలికిన ప్రతి మాట ఓ తూటాలా పేలింది. ఆమె సమాజ్‌ వాదీ పార్టీ నేత ఫహద్‌ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వారు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్‌ ఈ మధ్యనే సీమంతం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఆమఎ పండంటి బిడ్డకు జన్మనించారు. ఈ విషయాన్ని స్వరభాస్కర్‌, ఆమె భర్త ఫహద్‌(Fahad) సోషల్‌ మీడియా(Social media) వేదికగా వెల్లడించారు. ఈ నెల 23న పాప పుట్టిందని చెప్పారు.ఆ పాపకు పేరు కూడా పెట్టారు. తమ చిన్నారికి రుబియా(Rubiya) అనే పేరు పెడుతున్నట్టు దంపతులు పేర్కొన్నారు. స్వర భాస్కర్‌- ఫహద్‌ అహ్మద్‌ ఓ నిరసన కార్యక్రమంలో మొదటిసారి కలుసుకున్నారు. ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అలా మొదట రిజిస్టర్‌ మ్యారేజ్‌ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ దంపతులు మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. జూన్‌లో గర్భందాల్చినట్టు తెలిపారు స్వర భాస్కర్‌. తాజాగా పాపాయికి జన్మనిచ్చిన స్వర దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated On 26 Sep 2023 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story