మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్‌ తేజ(Sai dharam tej) తన పేరు మార్చుకున్నాడు. తల్లి దుర్గ పేరును తన పేరుకు జత కలిపాడు. సరికొత్తగా సాయిదుర్గ తేజ్‌గా(Sai durga tej) పేరు పెట్టుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని సాయిదుర్గ తేజ చెప్పాడు. అలాగే అమ్మ పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాలన్న కలను కూడా నెరవేర్చుకున్నాడు.

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్‌ తేజ(Sai dharam tej) తన పేరు మార్చుకున్నాడు. తల్లి దుర్గ పేరును తన పేరుకు జత కలిపాడు. సరికొత్తగా సాయిదుర్గ తేజ్‌గా(Sai durga tej) పేరు పెట్టుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని సాయిదుర్గ తేజ చెప్పాడు. అలాగే అమ్మ పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాలన్న కలను కూడా నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌(Durgha Production banner) ప్రారంభించినట్లు సాయిదుర్గ తేజ తెలిపాడు. ఈ బ్యానర్‌ ద్వారానే సోల్‌ ఆఫ్‌ సత్య షార్ట్‌ ఫిలిం రూపొందిందని అన్నాడు. మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే ( అంతర్జాతీయ మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్‌ ఆఫ్‌ సత్య ప్రత్యేక ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును మెగా హీరో ప్రకటించారు. రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా? అని అడిగిన ప్రశ్నకు మొన్నే పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేశానని, అంతకుముందు నాగబాబుగారితో చేశానని, తన నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవిగారేనని సాయిదుర్గ తేజ చెప్పుకొచ్చాడు. మా చిరంజీవి మామయ్యతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్‌ చేస్తానన్నాడు. ఇంతకీ గాంజా శంకర్‌ సినిమా ఉందా? ఆగిపోయిందా? అని అడిగితే సినిమా ఆగిపోయిందని ఓ వెబ్‌సైట్‌లో వార్త చూశాకే తనకు కూడా తెలిసిందని తెలిపాడు. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్‌సైట్స్‌ చెప్తే కానీ తెలియదు అని సెటైర్‌ విసిరారు. సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిలిం సత్య. సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న సంగతి తెలిసిందే!

Updated On 9 March 2024 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story