తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఇటీవల నటించిన సినిమాలేవీ పెద్దగా పోలేదు. నిరుడు వచ్చిన జైలర్‌(Jailer) మాత్రం కలెక్షన్లను కుమ్మేసింది. ఆ తర్వాత వచ్చిన లాల్‌ సలామ్‌(Lal salam) తుస్సుమంది. అయినా కానీ రజనీకాంత్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 171 వ సినిమాకు కూలీ(Kuli) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఇటీవల నటించిన సినిమాలేవీ పెద్దగా పోలేదు. నిరుడు వచ్చిన జైలర్‌(Jailer) మాత్రం కలెక్షన్లను కుమ్మేసింది. ఆ తర్వాత వచ్చిన లాల్‌ సలామ్‌(Lal salam) తుస్సుమంది. అయినా కానీ రజనీకాంత్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 171 వ సినిమాకు కూలీ(Kuli) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కూలీ అనే పేరుతో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. అప్పట్లో అమితాబ్‌బచ్చన్‌ హీరోగా వచ్చిన కూలీ ఘన విజయం సాధించింది. వెంకటేశ్‌ నటించిన కూలీ నెంబర్‌ వన్‌ కూడా అంతే. ఇంతకు ముందు తమిళంలో శరత్‌కుమార్‌ కూడా కూలీ పేరుతో ఓ సినిమా చేశారు. ఇప్పుడు రజనీ హీరోగా మరో కూలీ! ఈ సినిమాను స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ రూపొందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో చాలా కాలం తర్వాత శోభన సూపర్‌స్టార్‌ సరసన నటిస్తున్నారు. మరో కీలకపాత్రలో శ్రుతి హాసన్‌ కనిపిస్తారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh) కూడా ఇందులో నటిస్తున్నారు. అనిరుధ్‌(Anirudh) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలయ్యింది. ఇందులో రజనీ గెటప్‌ అదిరిపోయింది. ఇప్పుడు కూలీ టైటిల్, టీజర్‌లను చూస్తుంటే దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ సరికొత్త రజనీకాంత్‌ను తెరపై చూపుతున్నారనిపించింది. లోకేష్‌ కనకరాజ్‌కు తన చిత్రాల షూటింగ్‌ ప్రారంభానికి ముందే టీజర్‌ను విడుదల చేసి, సెన్సేషనల్‌ క్రియేట్‌ చేయడం రివాజుగా మారింది. ఇప్పుడు కూలీ కూడా షూటింగ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య కమలహాసన్‌ హీరోగా చేసిన విక్రమ్‌ చిత్రం టీజర్‌లో ఆరంబిక్కలామా అనే డైలాగ్‌తో టీజర్‌ను రూపొందించి ఉత్కంఠతకు తెరతీశారు. ఆ తరువాత విజయ్‌తో చేసిన లియో చిత్ర టీజర్‌లో బ్లడీ స్వీట్‌ అంటూ సినిమాపై అంచనాలను పెంచేశారు. లేటెస్ట్‌గా రజనీకాంత్‌ కూలీ సినిమా టీజర్‌లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్‌ ఉంది. ఇవన్నీ చూస్తుంటే కూలీ సినిమా బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమాలా అనిపిస్తోంది. రజనీకాంత్‌ స్మగ్లర్‌గా నటిస్తున్నారు కాబోలు! అన్నట్టు ఈ సినిమాకు రజనీకాంత్‌ ఎంత రెమ్యునిరేషన్‌ తీసుకుంటున్నారో తెలుసా? ఏకంగా 260 కోట్ల రూపాయలు. దర్శకుడు లోకేశ్ పారితోషికమే 60 కోట్ల రూపాయలు ఉందట! ఇది నిజమే అయితే మాత్రం సౌత్‌ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేశ్‌ నరకరాజే అవుతాడు. ఈ సినిమా జూన్‌లో సెట్‌పైకి వెళుతుంది.

Updated On 25 April 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story