సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) హిమాలయాలకు(Himalayas) వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. బుధవారం చెన్నై(chennai) నుంచి విమానంలో బయలుదేరిన ఆయన ఎయిర్‌పోర్టులో కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యమని, హిమాలయాలకు వెళ్లిన ప్రతీసారి కొత్త అనుభూతి కలుగుతుందని, అందుకే తాను ప్రతి ఏటా హిమాలయాలకు వెళుతున్నానని చెప్పారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) హిమాలయాలకు(Himalayas) వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. బుధవారం చెన్నై(chennai) నుంచి విమానంలో బయలుదేరిన ఆయన ఎయిర్‌పోర్టులో కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యమని, హిమాలయాలకు వెళ్లిన ప్రతీసారి కొత్త అనుభూతి కలుగుతుందని, అందుకే తాను ప్రతి ఏటా హిమాలయాలకు వెళుతున్నానని చెప్పారు. మన దగ్గరే కాదు, ప్రపంచమంతా ఆధ్యాత్మిక భావం అవసరమని చెబుతూ ఆధ్యాత్మికత అంటే శాంతి(Peace), ప్రశాంతత, భగవంతునిపై నమ్మకం అని తెలిపారు రజనీ. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌(Kedharnath) క్షేత్రాలను సందర్శించుకోవడానికి వెళుతున్నానని చెప్పారు. మోదీ(PM Modi) మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న ప్రశ్నకు జవాబివ్వకుండా రాజకీయాలకు(Politics) సంబంధించిన ప్రశ్నలు అడగవద్దన్నారు. తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించిన తర్వాత జూన్‌ 4వ తేదీన చెన్నైకు తిరిగి రానున్నారు. ప్రస్తుతం టీ.జే.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వేట్టయాన్‌ సినిమాలో రజనీ నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Updated On 29 May 2024 7:30 AM GMT
Ehatv

Ehatv

Next Story