అన్నం తింటున్నాడో.. అమృతం తాగుతున్నాడో తెలియదు కాని.. 50 ఏళ్ళు మీద పడుతున్నా.. కుర్రాళ్లను మించిన హ్యాండ్సమ్ నెస్ తో పాటు.. యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ.. మెస్మరైజ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మూవీ లవర్స్‌కు, అభిమానులకు షాక్‌కు ఇస్తుంటాడు. టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్ బాబు. పోకిరి సినిమా తరువాత తర్వాత ప్రతీ సినిమాకు కొత్తగా మేకోవర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్ ను దిల్ ఖుషీ చేస్తున్నాడు. చాలా మంది సీనియర్‌ స్టార్ హీరోలకు వయస్సు పెరుగుతుంటే..

అప్పుడప్పుడు అలా జర్క్ లు ఇస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). సూపర్ గా మేకోవర్ అయ్యి.. బాబోయి అనిపిస్తాడు బాబు. ముఖ్యంగా అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు.

అన్నం తింటున్నాడో.. అమృతం తాగుతున్నాడో తెలియదు కాని.. 50 ఏళ్ళు మీద పడుతున్నా.. కుర్రాళ్లను మించిన హ్యాండ్సమ్ నెస్ తో పాటు.. యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ.. మెస్మరైజ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మూవీ లవర్స్‌కు, అభిమానులకు షాక్‌కు ఇస్తుంటాడు. టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్ బాబు.

పోకిరి సినిమా తరువాత తర్వాత ప్రతీ సినిమాకు కొత్తగా మేకోవర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్ ను దిల్ ఖుషీ చేస్తున్నాడు. చాలా మంది సీనియర్‌ స్టార్ హీరోలకు వయస్సు పెరుగుతుంటే.. మహేశ్ బాబు విషయంలో మాత్రం వచిత్రంగా రోజు రోజుకీ వయస్సు తగ్గిపోతోంది అనిపిస్తుంది. గతంలో.. ఇప్పుడు మహేష్ ను చూసినవారికి అది అర్ధం అవుతుంది.

ఇక తాజాగా మరోసారి నయా లుక్ తో బ్లాస్టింగ్ చేశాడు మహేష్. ట్రెండీ స్టిల్స్‌లో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ప్రిన్స్‌తాజాగా హాలీవుడ్‌ స్టార్లకు ఏ మాత్రం తగ్గకుండా కంప్లీట్‌ స్టైలీష్ లుక్ లో ఫోటో షూట్ చేశాడు. కొత్త లుక్‌లో మహేష్ కెమెరాకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రింగుల జుట్టుతో బ్లూ అండ్ బ్లాక్‌ జీన్స్ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకుని దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. బీటీఎస్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు మహేశ్‌. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గుంటూరు కారం టైటిల్ ఫిక్స్‌ చేయగా.. మాస్‌ స్ట్రైక్‌ వీడియో ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలిచింది.ఈసినిమా తరువాత డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ఎస్‌ఎస్‌ఎంబీ 29పై ఫోకస్ పెట్టనున్నాడు మహేశ్ బాబు. గ్లోబల్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా సౌతాఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉంది జక్కన్న టీం.

Updated On 9 Jun 2023 10:47 PM GMT
Ehatv

Ehatv

Next Story