ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu) ఫ్యామిలీమ్యాన్‌. ఎప్పుడైనా కుటుంబానికే ఫస్ట్‌ ప్రియారిటీ ఇస్తారాయన! తీరిక దొరికితే చాలు భార్య పిల్లలతో ఫారిన్‌కు ట్రిప్పేస్తుంటారు. అలాగని సినిమాలను ఏమీ నెగ్లట్‌ చేయరు. దానికిచ్చే ఇంపార్టెన్స్‌ దానికిస్తుంటారు. ఈమధ్యనే ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌(France), జర్మనీ(Germany)లకు హాలీడే ట్రిప్‌(Holyday trip)కు వెళ్లివచ్చిన మహేశ్‌బాబు మరోసారి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు.

ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu) ఫ్యామిలీమ్యాన్‌. ఎప్పుడైనా కుటుంబానికే ఫస్ట్‌ ప్రియారిటీ ఇస్తారాయన! తీరిక దొరికితే చాలు భార్య పిల్లలతో ఫారిన్‌కు ట్రిప్పేస్తుంటారు. అలాగని సినిమాలను ఏమీ నెగ్లట్‌ చేయరు. దానికిచ్చే ఇంపార్టెన్స్‌ దానికిస్తుంటారు. ఈమధ్యనే ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌(France), జర్మనీ(Germany)లకు హాలీడే ట్రిప్‌(Holyday trip)కు వెళ్లివచ్చిన మహేశ్‌బాబు మరోసారి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఈసారి దుబాయ్‌(Dubai) పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన ఓ లగ్జరీ విల్లా(Luxury Villa)ను కొన్నారట. అలాగని సోషల్‌ మీడియా కోడై కూస్తున్నది. సినిమాలతో వ్యాపారరంగంలోనూ బోల్డంత సంపాదిస్తున్నారు మహేశ్‌బాబు. రెస్టారెంట్‌, మల్టిప్లెక్స్‌ బిజినెస్‌లు చేస్తున్నారన్న విషయం తెలిసిందే! మహేశ్‌బాబు ముందుజాగ్రత్తగా పలు నగరాలలో లగ్జరీ విల్లాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు దుబాయ్‌లోనూ ఓ విలాసవంతమైన విల్లాను కొన్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయడానికే ఆయన దుబాయ్‌కు వెళ్లారని కొందరు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ సినిమాపై కాన్‌సంట్రేషన్‌ చేయనున్నారు. ఖలేజా సినిమా తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మహేశ్‌ చేస్తున్న సినిమా ఇది. అంతకు ముందు బ్లాక్‌బస్టర్‌ మూవీ అతడులో కూడా నటించారు. త్రివిక్రమ్‌తో మహేశ్‌కు ఇది మూడో సినిమా. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవర్‌ 13న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు మహేశ్‌బాబు.

Updated On 1 May 2023 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story