రీరిలీజ్ ల ట్రెండ్ బాగా వర్కౌట్ అయ్యింది. అభిమాను తారల సినిమాలు మళ్ళీ థియేటర్ లో చూసి.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. మేకర్స్ కు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.దాంతో మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

రీరిలీజ్ ల ట్రెండ్ బాగా వర్కౌట్ అయ్యింది. అభిమాను తారల సినిమాలు మళ్ళీ థియేటర్ లో చూసి.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. మేకర్స్ కు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.దాంతో మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇప్పుడు మరోసారి మహేష్ వంతు వచ్చింది. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu)కు సబంధించి రెండు మూడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించాయి. ఇక ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిజినెస్ మ్యాన్(Businessman). ఈమూవీ హిట్ అవ్వలేదు అంటారు కాని.. మహేష్ బాబు మాస్ ఇమేజ్ ను మాత్రం అమాంతం పెంచేసింది. బిజినెస్ మెన్ సినిమా అనేది ఓ పోకిరి మాదిరి ట్రెండ్ సెట్టర్ అని అనుకోవచ్చు. మహేష్ ఇమేజ్ ను ఇండస్ట్రీ లో మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది.

ఇక మాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతో బాగా ఆకట్టుకుంది. మాస్ జనాలు ఈసినిమా డైలాగ్స్ కు.. స్టెప్పులకు ఫిదా అయ్యి.. రచ్చ రచ్చ చేశారు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న బిజినెస్ మెన్ సినిమాగు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించారు. దాంతో ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. బిజినెస్ మెను ను తెరపై చూసి హడావిడి చేయడానికిరెడీ అవుతున్నారు.

ఇక ప్రస్తుంతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన లో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకు గుంటూరుమిర్చి అనే టైటిల్ కూడా ఖరారుచేశారు. రీసెంట్ గా ఫస్ట్ గ్లిప్ వీడియోను టైటిల్ తో సహా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈసినిమా హిట్ అవుతుందా..లేదా.. అనేది చూడాలి.

Updated On 2 Jun 2023 5:50 AM GMT
Ehatv

Ehatv

Next Story