సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu)- దర్శకుడు రాజమౌళి(RajaMouli) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్సే కాదు, ఇండియా మొత్తం అమితాసక్తితో ఎదురుచూస్తోంది. ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానులలో అమితమైన అంచనాలను నెలకొల్పారు. ఇది పాన్‌ వరల్డ్‌ రేంజ్‌ సినిమా అనే ప్రచారం జరుగుతుండటంతో మహేశ్ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu)- దర్శకుడు రాజమౌళి(RajaMouli) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్సే కాదు, ఇండియా మొత్తం అమితాసక్తితో ఎదురుచూస్తోంది. ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానులలో అమితమైన అంచనాలను నెలకొల్పారు. ఇది పాన్‌ వరల్డ్‌ రేంజ్‌ సినిమా అనే ప్రచారం జరుగుతుండటంతో మహేశ్ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌(Vijayendra Prasad) అద్భుతమైన రీతిలో కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేశ్‌బాబు ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా లాంచింగ్‌ కార్యక్రమాలు మహేశ్‌బాబు బర్త్‌డే(Mahesh Babu Birthday) సందర్భంగా ఆగస్టు 9న గ్రాండ్‌గా జరపడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసిందట. అందుకోసం ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారట. నవంబర్‌లో సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట! ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమాను వేగంగా పూర్తి చేయమని త్రివిక్రమ్‌కు మహేశ్‌బాబు చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలో జరుగుతోంది. గ్యాప్‌ లేకుండా మహేశ్బాబు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా మొదలు కానుంది. పక్కా ప్రణాళికతోనే ఎస్‌.ఎస్‌.ఎమ్‌.బీ 29బృందం రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఇక రైటర్‌ విజేంద్రప్రసాద్‌ తాజాగా ఈ సినిమాకు ఓపెన్‌ ఎండింగ్‌ ఉంటుందని, సీక్వెల్‌కు అవకాశం ఉంటుందని చెప్పి మహేశ్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ నింపాడు.

Updated On 26 Jun 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story